E-Paper
Advertisement

Olectra Electric Car: ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించిన సీఎం, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Olectra Electric Car: ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించిన సీఎం, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రేజీ ఎలక్ట్రికల్ కారును ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ కారును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీమంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లాంచ్ చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. వెనుక సీట్లో మెగా ఇంజినీరింగ్ సంస్థ, ఈ కారు తయారు చేసిన కంపెనీ అధినేత  మెగా కృష్ణారెడ్డి కూర్చున్నారు.

ఇంతకీ ఏంటీ ‘ఒలెక్ట్రా’ కంపెనీ?

‘ఒలెక్ట్రా’ అనేది ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, మెగా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చాలా మందికి తెలుసు. తెలుగు వ్యక్తి మెగా క్రిష్ణారెడ్డికి చెందిన కంపెనీ ఇది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ ప్రాజెక్టులను చేపడుతుంది. కృష్ణారెడ్డికి చెందిన మరో కంపెనీయే ‘ఒలెక్ట్రా’. ఇప్పటికే  చక్కటి ఎలక్ట్రిక్ బస్సును తయారు చేస్తోంది. తాజాగా తన తొలి ఎలక్ట్రిక్ కారును తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ తో ఆవిష్కరించేలా చేశారు. ప్యూచర్ సిటీ ప్రాంగణంలో మెగా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించడంతో.. తెలుగు కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ కారు  సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణతో మెగా సంస్థకు చెందిన ఒలెక్ట్రా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కారుకు సంబంధించిన మిగిలిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Advertisement

దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ అనేది భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ బస్ తయారీదారులలో ఒకటి. ఇది ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్‌లు, ఎలక్ట్రిక్ టిప్పర్లు,ఇతర వాహనాలను తయారుచేస్తుంది, కానీ ప్యాసింజర్ కార్లను తయారు. చేలేదు. కానీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ఇక బస్సులు, టిప్పర్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ఒలెక్ట్రా కంపెనీ గురించి..

Advertisement

⦿ స్థాపన-భాగస్వామ్యం: ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 2000లో స్థాపించబడింది. చైనా BYD కంపెనీతో జాయింట్ వెంచర్ లో భాగంగా దీనిని హైదరాబాద్‌ లో ఏర్పాటు చేశారు. ఇక్కడే ముఖ్యమైన  ఫ్యాక్టరీ ఉంది.

⦿ ఉత్పత్తులు: ఈ కంపెనీ ప్రధానంగా బస్సులు, టిప్పర్లు తయారు చేస్తుంది.  ఈ కంపెనీ నుంచి వచ్చిన eBuzz K7 బస్సు 9 మీటర్ల పొడవు, 31 సీట్లను కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 200 కి.మీ. రేంజ్ లభిస్తుంది. 70 కి.మీ గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది.  eBuzz K9 బస్సు 12 మీటర్ల పొడవు ఉంటుంది. X2 (ఎయిర్‌పోర్ట్ షటిల్), CX2 (ఇంటర్‌సిటీ కోచ్), V2 (లోకల్ ట్రాన్స్‌పోర్ట్) బస్సులను తయారు చేస్తుంది. బస్సులతో పాటు Meghaetron 28T అనే ఎలక్ట్రిక్ టిప్పర్ ను కూడా తయారు చేసింది. త్వరలోనే ఎలక్ట్రిక్ కార్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

Read Also: మారుతి సుజుకి ఈ-విటారా వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×