E-Paper
Advertisement

Double Decker Vande Bharat: డబుల్ డెక్కర్ వందేభారత్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

Double Decker Vande Bharat: డబుల్ డెక్కర్ వందేభారత్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!
Advertisement

Double Decker Vande Bharat Trains: దేశంలో 15 సంవత్సరాల క్రితం డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చింది.  2011లో హౌరా-ధన్‌ బాద్ మధ్య మొదటి AC డబుల్ డెక్కర్ రైలును భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది. 2012లో ఢిల్లీ, జైపూర్ మధ్య మరొక డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత బెంగళూరు- కోయంబత్తూర్, విశాఖపట్నం- విజయవాడ జంక్షన్ మధ్య ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి (ఉదయ్) ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టారు. ముంబై సెంట్రల్ – అహ్మదాబాద్, చెన్నై సెంట్రల్ – బెంగళూరు,  భోపాల్-ఇండోర్ డబుల్ డెక్కర్ రైళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

వందేభారత్ డబుల్ డెక్కర్ రైళ్లు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 150కి పైగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. దాపు 600-800 కిలోమీటర్ల దూరానికి వేగవంతమైన కనెక్టివిటీని అందించేలా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. వందే భారత్ స్లీపర్ ఇప్పుడు దాదాపు 1,000 కిలోమీటర్ల సుదూర ప్రయాణాలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. భారతీయ రైల్వే ఇప్పటికే బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై పని చేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే నిపుణులు కీలక ప్రతిపాదనలు రెడీ చేశారు. ఉదయ్ ఎక్స్‌ ప్రెస్ లు లేదంటే , వందే భారత్ డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశ పెట్టాలన్నారు. వీటి వల్ల 300-400 కిలోమీటర్ల వరకు స్వల్ప దూర ప్రయాణంలో రద్దీని పెద్ద మొత్తంలో తగ్గించే అవకాశం ఉందని వెల్లడించారు. వందే భారత్ డబుల్ డెక్కర్ రైళ్లు ఇంటర్‌ సిటీ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణం  

Advertisement

డబుల్ డెక్కర్ ఒక రేక్‌ కు 40–50% ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. అధిక డిమాండ్ ఉన్న కారిడార్లలో రద్దీని భారీగా తగ్గిస్తాయి.

పరిమిత ట్రాక్‌ల మెరుగైన ఉపయోగం

కొత్త ట్రాక్‌లను ఏర్పాటు చేయడానికి బదులుగా, డబుల్ డెక్కర్ రైళ్లు ఇప్పటికే ఉన్న రద్దీ మార్గాల్లో సామర్థ్యాన్ని పెంచుతాయి.

3–5 గంటల ప్రయాణాలకు అనుకూలంగా

Advertisement

స్లీపర్ కోచ్‌లు అవసరం లేని హై స్పీడ్ పగటి ప్రయాణానికి 300–400 కి.మీ వరకు ఈ రైళ్లు అనుకూలంగా ఉంటాయి.

విమానంలో మాదిరి సౌకర్యాలు   

ప్రీమియం సీటింగ్, ఆధునిక ఇంటీరియర్స్, వేగవంతమైన టర్నరౌండ్ సౌకర్యం సహా అచ్చం విమాన ప్రయాణం లాంటి సౌకర్యాలను పొందే అవకాశం ఉంది.

Read Also: కాశీ To అయోధ్య… IRCTC అద్భుతమైన యాత్ర ప్యాకేజీ!

తగ్గనున్న ఆపరేషనల్ ఖర్చు

రైలుకు ఎక్కువ సీట్లు ఉండడం వల్ల మెరుగైన ఆదాయ సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు అవుతుంది. ఫలితంగా ఆపరేషనల్ ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు తగ్గనున్న రద్దీ  

ప్రస్తుతం, ప్రజలు స్లీపర్, థర్డ్ క్లాస్ రైళ్లలోకి ఎక్కుతున్నారు. దీని కారణంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రీమియం డే ప్రయాణికులను సెమీ హైస్పీడ్ సర్వీసులకు మార్చుతాయి. ఫలితంగా ప్రదాయ రైళ్లలో సీట్లు లభిస్తాయి.

Read Also: ఓ వందభారత్, రెండు అమృత్ భారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×