E-Paper
Advertisement

మే 15లోపు పేలనున్న ఫ్యూయెల్ బాంబ్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు?

మే 15లోపు పేలనున్న  ఫ్యూయెల్ బాంబ్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు?
Advertisement

Petrol and Diesel Prices Rise: ప్రపంచ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా భారత్‌ లో ఇంధన ధరలు రానున్న రోజుల్లో పెరగొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయిల్ కంపెనీలకు నష్టాలు

ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL)పై భారీ ఒత్తిడి పెరుగుతోందని సమాచారం. అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు పెరిగినా, దేశీయంగా వెంటనే ధరలు పెంచకపోవడంతో ఈ కంపెనీలు నష్టాలను భరిస్తున్నట్లు తెలుస్తోంది.

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు

Advertisement

ఇటీవల పశ్చిమ ఆసియా ప్రాంతంలో పెరిగిన ఉద్రిక్తతలు చమురు రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి దగ్గర పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ మార్పుల ప్రభావం భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై ఎక్కువగా పడుతోంది.

లీటర్ పై రూ. 5 వరకు పెరిగే అవకాశం

అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మే 15లోపు దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే కొన్నిరోజులుగా చమురు కంపెనీలకు లీటరుకు నష్టాలు వస్తున్నాయని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తాయి. అందువల్ల త్వరలోనే ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు.

Advertisement

ఇంధన ధరలు పెరిగితే సాధారణ ప్రజలపై కూడా ప్రభావం పడనుంది. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ట్రాన్స్‌ పోర్ట్ రంగం నుంచి వ్యవసాయం వరకు అనేక రంగాలపై ఇంధన ధరల ప్రభావం ఉంటుంది. దీంతో మార్కెట్‌లో ద్రవ్యోల్బణ ఒత్తిడి మరింత పెరగవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం

పెట్రోల్‌, డీజిల్‌తో పాటు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరగవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు కూడా పెరుగుతుండటంతో చమురు కంపెనీలపై అదనపు భారం పడుతోంది. ఈ కారణంగా గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ తన అవసరాల్లో ఎక్కువ భాగం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో చిన్న మార్పు వచ్చినా దేశీయ ధరలపై దాని ప్రభావం త్వరగా కనిపిస్తుంది. ముఖ్యంగా డాలర్ మారకం విలువ, చమురు రవాణా పరిస్థితులు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తుంటాయి.

Read Also: ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. దేశంలో అత్యంత ఎక్కువ రేట్లు హైదరాబాద్‌ లోనే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×