Tata Motors Price Hike: దేశీయ దిగ్గజ ఆటో మోబైల్ సంస్థ టాటా మోటార్స్ కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. కార్ల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను కారణంగా ఐసీఈ (ICE) ప్యాసింజర్ వాహనాల ధరలను ఏప్రిల్ 1, 2026 నుంచి పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న ధరలతో పోల్చితే, ఆయా కార్ల ధరలు 0.5% పెరగనున్నట్లు తెలిపింది.
టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిపై ధరల పెంపును అమలు వివరాలను వెల్లడించింది. కొత్త ధరలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ధరల పెంపు కేవలం కంపెనీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) మోడళ్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ పెంపు వర్తించదని ప్రకటించింది. కార్ల ధరలు ధరలు సగటున 0.5% మేర పెరుగుతాయని తెలిపింది. వేరియంట్ల వారీగా మార్పుల వివరాలు వెల్లడించనప్పటికీ, పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను టెంపరరీగా భర్తీ చేయడానికి ఈ పెంపును చేయాల్సి వస్తుందని కంపెనీ తెలిపింది.
కార్ల ధరల పెంపునకు సంబంధించి టాటా మోటార్స్ తో పాటు లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, ఆడి కీలక ప్రకటనలు చేశాయి. టాటా కంటే ముందే, ఈ రెండు కంపెనీలు తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ సంస్థలు కూడా పెంచిన ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపాయి. కమర్షియల్ పరంగా, టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల (CV) శ్రేణి అంతటా 1.5% వరకు ప్రత్యేక పెంపును అమలు చేయనుంది. ఈ పెంపు కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి డిజైర్.. 30 లక్షల సేల్స్ వెనుక సీక్రెట్ ఏంటి?
అటు టాటా కంపెనీ మరో కీలక విషయాన్ని వెల్లడించింది. భారత్ NCAP క్రాష్ పరీక్షలలో టాటా సియెర్రా 5 స్టార్ భద్రతా రేటింగ్ ను సాధించినట్లు తెలిపింది. ఈ SUV పెద్దల రక్షణలో దాదాపు కంప్లీట్ స్కోరును సాధించింది. టాటా కంపెనీ ఇటీవల భారత్ లో పంచ్ EVని విడుదల చేయడంతో తన EV పోర్ట్ ఫోలియోను కూడా విస్తరించింది.
Read Also: 6 ఏళ్లలో 7 కొత్త SUVలు, మారుతి సుజుకి ప్లాన్ మామూలుగా లేదుగా!