ACB Raids: తెలంగాణలో అవినీతి అధికారుల గుట్టురట్టు చేసేందుకు ఏసీబీ స్పీడ్ పెంచింది. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డి అవినీతి లీలలపై నిఘా పెట్టిన అధికారులు.. ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు, స్నేహితులకు చెందిన మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఒక్కొక్క చోట దొరుకుతున్న ఆస్తుల వివరాలు చూసి ఏసీబీ అధికారులే ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది.
ఇంతకీ ఈ అవినీతి అధికారి సంపాదించిన అక్రమాస్తుల చిట్టా ఏంటో తెలుసా? ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4 విలాసవంతమైన ఇళ్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఆయన కూడబెట్టారు. వివిధ ప్రాంతాల్లో 8 ఓపెన్ ప్లాట్లు, పది ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. ఇంట్లో దొరికిన మూడు లక్షల 31 వేల నగదుతో పాటు.. బ్యాంకుల్లో ఏకంగా 50 లక్షల రూపాయల క్యాష్ బ్యాలెన్స్ బయటపడింది. మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న 3 బ్యాంక్ లాకర్లను అధికారులు గుర్తించారు. వీటిని ఓపెన్ చేస్తే ఇంకెంత బంగారం, నగదు బయటపడుతుందో చూడాలి.
Also read: కరువు కోరలకు దొరకకుండా! ఆచితూచి నాట్లు.. వానకాలం సీజన్కు నెల రోజుల క్రాప్ హాలిడే..!
ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. అంటే డాక్యుమెంట్ల ప్రకారం ఈ ఆస్తుల విలువ కేవలం మూడు కోట్ల రూపాయలుగా చూపిస్తున్నారు. కానీ.. ఓపెన్ మార్కెట్లో వీటి విలువ పదుల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అదనపు ఆస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Also read: Harish Rao: రేవంత్ రెడ్డి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!