AP Tribal Rights: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగ నియామకాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్ 3 ని వెంటనే పునరుద్ధచడం, గిరిజన యువత ఉపాధి కాపాడటానికి ప్రత్యేక చట్టం తీసుకురావడం, గిరిజనేతరులకు ఏజెన్సీ భూములు బదిలీ కాకుండా అడ్డుకునే చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం ఇలాంటివి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 50 శాతానికి పైగా గిరిజన జనాభా ఉన్న అన్ని గ్రామాలను ఫిఫ్త్ షెడ్యూల్ లో చేర్చడం మన్యం పరిధిలో మైనింగ్, హైడ్రో ప్రాజెక్టులు రద్దు ఇవన్నీ గిరిజనుల పోరులో కీలకంగా మారాయ్.
Also Read: ఫస్ట్ నైట్ రోజే ఊహించని ట్విస్ట్… భార్యను తాకితే కరెంట్ షాక్ కొట్టే వింత ప్రేమకథ
ఆగస్టు 9న వరల్డ్ ట్రైబల్ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవో 3 పునరుద్ధరణ అలాగే గిరిజన హక్కులపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో తరతరాలుగా కొండలు, అడవులను నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు భూమిపై హక్కు, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించడం వారి ప్రాథమిక హక్కు. వాటికి అండగా నిలబడడం, ఆదివాసీల్లో నమ్మకం పెంచడం ప్రభుత్వ బాధ్యత. మరి ఈ విషయంలో ఏం జరగబోతోంది?
Also Read: క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఈవెంట్లో.. యువతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు!