E-Paper
Advertisement

పరిటాల శ్రీరామ్ ‘సైలెంట్’ వ్యూహం.. ధర్మవరంలో ఏం జరుగుతోంది?

పరిటాల శ్రీరామ్ ‘సైలెంట్’ వ్యూహం.. ధర్మవరంలో ఏం జరుగుతోంది?
Advertisement

Paritala Sriram: పరిటాల శ్రీరామ్.. ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్.. కానీ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పదవి లేకున్నా ప్రత్యేక ఇమేజ్ క్రియేట్‌ చేసుకున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీకి కౌంటర్ ఎటాక్ చేసే ఈ యువనేత.. ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు..

Advertisement

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం సీటు ఆశించారు పరిటాల శ్రీరామ్. కానీ టికెట్ రాలేదు. బీజేపీ అభ్యర్థికి కూటమి టికెట్ ఇవ్వగా.. ఆయన గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం టీడీపీ ధర్మవరం ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ నేతలకు ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యేతో టీడీపీ సఖ్యత కుదరడం లేదు. బీజేపీ ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమం

Advertisement

టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తోంది. కానీ ధర్మవరంలో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించలేదు. ఎందుకు నిర్వహించలేదన్నది ఇక్కడ ప్రశ్న. గ్రీవెన్స్ నిర్వహిస్తే, ఎమ్మెల్యేపై ఫిర్యాదులు వస్తే దాన్ని ఎలా తీసుకోవాలి.. ఎలా వ్యవహరించాలి..? అప్పుడు అంతర్గత విభేదాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉండడంతోపాటు ప్రత్యర్థులకు ఇదో అవకాశంగా మారుతుంది. ఆ అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ గ్రీవెన్స్‌ నిర్వహించలేదన్న చర్చ ఉంది. బీజేపీ వ్యవహారంపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నా పరిటాల శ్రీరామ్ ఎక్కడా తన అసంతృప్తి వెళ్లగక్కలేదు. ఒకవైపు కార్యకర్తలను కాపాడుకుంటూనే మరోవైపు రాజకీయంగా వ్యూహాత్మక వైఖరి అవలంభిస్తున్నారు.

Also Read: ఫోన్‌లో రీల్స్ చూస్తోందని.. భార్యను చంపి, పరుపులో చుట్టి..

ఏం జరిగినా వైసీపీ వేలు శ్రీరామ్ వైపే..

రాప్తాడు శ్రీరామ్ తల్లి సునీత ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గంలో ఏం జరిగినా వైసీపీ వేలు శ్రీరామ్ వైపే చూపిస్తుంది. వైసీపీ నుంచి ఎంత బలమైన విమర్శలు వచ్చినా.. శ్రీరామ్ చాలా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆచితూచి స్పందిస్తున్నారు.

అప్పుడప్పుడు మౌనం మేలు చేస్తోంది..

రాజకీయాల్లో దూకుడే కాదు.. అప్పుడప్పుడు మౌనం కూడా మేలు చేస్తుంది.. మౌనం వెనుక కారణం అనుభవం నేర్పిన పాఠం కావొచ్చని లేదా కాలంతోపాటు సర్దుబాటు అవుతున్నారేమోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Also Read: విజయా డైరీపై లోకేష్ కుట్రలు.. బెదిరించి చైర్మన్‌తో రాజీనామా చేయించారు!- పేర్ని నాని

Tags

Related News

వందేమాతరానికి రాజ్యాంగ రక్షణ.. రాష్ట్రపతి ఆమోదం!

జంతర్ మంతర్‌ను మూసివేయండి.. కేంద్రానికి హైకోర్టు కీలక సూచన!

తెలంగాణ బీజేపీలో మైండ్ గేమ్‌.. ఢిల్లీ భేటీ తర్వాత అసలు ప్లాన్ లీక్!

పార్టీని నమ్ముకుంటే ఇచ్చే గౌరవం ఇదేనా.. గాంధీ భవన్‌లో బగ్గుమన్న పదవుల పంచాయతీ!

హైడ్రా ఎంట్రీతో షాక్‌లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!

ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ ఛార్జీలపై నిపుణులు చెబుతున్న నిజాలివే!

హామీలు నీ వ‌ల్ల కాదు.. కేసీఆర్ ఇచ్చిన‌వి ఇస్తే చాలు.. ఈట‌ల మార్క్ పొలిటిక‌ల్ స్ట్రైక్‌!

Big Stories

Advertisement
×