Vande Mataram: వందేమాతరం గేయానికి మరిన్ని రక్షణలు కల్పించే.. నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జాతీయ గేయాన్ని అవమానించడాన్ని నేరంగా గుర్తించేలా.. 1971 నాటి చట్టానికి.. కేంద్రం కొన్ని మార్పులు చేసింది. ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన బిల్లుకు.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. జాతీయ గీతం జన గణ మన స్థాయిలోనే.. వందేమాతరం గేయానికి ప్రాథమిక క్రమశిక్షణ, గౌరవ నియామకాలు.. ఈ చట్టం ద్వారా అమల్లోకి వచ్చాయి.
జాతీయ గీతాన్ని అవమానిస్తే జైలు శిక్ష
నిబంధనల ప్రకారం, జాతీయ గీతం ఆలాపనను అడ్డుకున్న వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఆలాపన సమయంలో అడ్డంకులు సృష్టించేవారికి కూడా ఇవే శిక్షలు! అంతకుముందున్న చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం, కేవలం జాతీయ గీతానికి మాత్రమే ఈ రక్షణలు ఉండేవి. ఇప్పుడు వందేమాతరం గేయానికి కూడా అవే రక్షణలు కల్పిస్తూ చట్టంలో మార్పులు చేశారు. ఇకపై వందేమాతరం గీతాన్ని ఎవరైనా అడ్డుకున్నా, బహిరంగంగా అవమానించినా, హేళన చేసినా.. చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
Also Read: పరిటాల శ్రీరామ్ ‘సైలెంట్’ వ్యూహం.. ధర్మవరంలో ఏం జరుగుతోంది?
కేంద్రం సంచలన చట్టం
పాఠశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో.. వందేమాతరం గీతాలాపన జరుగుతున్న సమయంలో.. గేయానికి విఘాతం కలిగించినా, అసౌకర్యం కలిగించినా.. చట్టప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశ చారిత్రక ప్రాధాన్యతను, జాతీయ భావాన్ని మరింత బలోపేతం చేసే దిశగా.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.