Graduate Elections: రెండు ఎమ్మెల్సీ సీట్లు, వేలాది మంది పట్టభద్రుల ఓట్లు, ఆరు ఉమ్మడి జిల్లాలు ఫిబ్రవరిలో రాబోయే గ్రాడ్యువేషన్ ఎన్నికలు కాంగ్రెస్కు గ్రాండ్ టెస్ట్ నిర్వహించబోతున్నాయి. ప్రభుత్వంపై చదువుకున్న వర్గం ఏమనుకుంటోంది? యువత ఏ దిశగా ఆలోచిస్తోంది? అనే విషయాన్ని చెప్పే రాజకీయ బ్యారోమీటర్ ఈఎన్నిక.
అందుకే ఆరు నెలల ముందే నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకు అప్పగించింది అధిష్టానం. ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. సిఫార్సులను పక్కన పెట్టి సర్వే అస్త్రాన్ని సంధించింది. మూడు వేర్వేరు ఏజెన్సీలతో ట్రిపుల్ సర్వే నిర్వహిస్తోంది. ఆ మూడింటిలోనూ ఏ లీడర్కైతే డిస్టెన్షన్ మార్కులు వస్తాయో వారికే బి-ఫామ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఒక్క సర్వేలో తేడా వచ్చినా అంతేసంగతీ.
Also Read: 100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్పై అంబటి ఫైర్!
ప్రస్తుతం పొలిటికల్ స్పేస్లో జెన్-జీ జోష్ నడుస్తోంది. సాంకేతికత, సరికొత్త ఆలోచనలు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలను ఆశించే నేటి తరం ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. జెన్-జీ జడ్జిమెంట్ ఇచ్చే టైమ్ వచ్చింది. మరి ఈ మూడు సర్వేల వ్యూహం కాంగ్రెస్ను గట్టెక్కిస్తుందా?
Also Read: పార్లమెంట్లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!