Special Session: పరీక్ష ఫెయిల్ అయితే సెప్టెంబర్లో చూసుకుందామనుకుంటారు విద్యార్థులు. కానీ పార్లమెంట్లో బిల్లు విగిపోతే మరో సెషన్లో స్కెచ్ వేద్దామని సర్కార్ అనుకుంటుంది. ఇప్పుడా ఆ సమయం రానేవచ్చింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రప్రభుత్వం పాస్ చేయించడానికి అన్ని అస్త్రశస్త్రాలను రెడీ చేస్తోంది. అందుకోసమే చట్టసభల ప్రత్యేక సెషన్ను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఎంతటి కీలక బిల్లులైనా ప్రతిపక్షాల సపోర్ట్ లేకుంటే సభలో సక్సెస్ అవ్వడం కష్టం. అందుకే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేరుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. బిల్లుల ఆమోదానికి సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. కానీ రాహుల్ గాంధీ సింపుల్గా నో చెప్పేశారు. బిల్లులలోని సాంకేతిక అంశాలు, సౌత్ స్టేట్లకు ఎదురయ్యే నష్టాలపై క్లారిటీ లేకుంటే మద్దతు తెలిపే ప్రసక్తే లేదని యుద్ధానికి ముందే అగ్గిరాజేశారు రాహుల్ గాంధీ.
Also Read: నాలుగు నెలల పసికందును కాపాడిన జగ్గారెడ్డి!
ప్రతిపక్షం నై అంటేనేం ఎన్డీఏ కూటమికి మునుపటి కంటే సంఖ్యాబలం పెరిగింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర సహా పలు ఇతర రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు, ఇతర పార్టీల నుంచి జరిగిన చేరికల తర్వాత లెక్కలు మారిపోయాయి. కానీ ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఒక్కటే పెరిగిన ఈ బలంతో కేంద్రం పార్లమెంట్లో ఈ రెండు భారీ బిల్లులను గట్టెక్కించగలదా? ఎన్నో సవాళ్లు, విభేదాల నడుమ కేంద్రం ప్రత్యేక సెషన్ను ఎలా డీల్ చేయబోతోంది.
Also Read: వైరల్ కావడం కోసం ఏమైనా చేస్తారా.. టాలీవుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మైండ్ బ్లాకింగ్ డ్రామాలు!