DSC Irregularities: డిఎస్సీలో అవకతవకలు పరిష్కరించాలని నిరాహార దీక్ష చేసిన వారికి అంబటి రాంబాబు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయని అన్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్న పోరాటాన్ని మొదలు పెట్టామన్నారు. మరో మూడు రోజులు ఇలాగే దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంతో మాకు మంచి స్పందన లభిస్తుందని పేర్కోన్నారు.
ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని, కొన్ని చోట్ల టెంట్లు, మైక్లు లాక్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేదంటూ కొన్ని చోట్ల టిడిపి వాళ్ళే టెంట్లు పీకేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రోత్సాహంతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అంబటి రాంబాబు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా సమాధానం చెప్పే రోజు వస్తుందని, బోండా ఉమా దాడి నాపై చేశాడని, చంద్రబాబు వద్ద కోల్పోయిన విశ్వాసాన్ని సంపాదించడానికి దాడి చేసి ఉంటాడని ఫైర్ అయ్యారు.
Also Read: వాహనాలకు ఇన్సురెన్స్ అవసరమా? దాని వల్ల ఉపయోగాలేంటీ?
నాతో కూర్చున్నందుకు విశ్వాసం కోల్పోయాడు. తలకిందుల తపస్సు చేసిన బొండా ఉమా చంద్రబాబు మెప్పు పొందలేడని తేల్చి చెప్పారు. బాబుకు ప్రజలే బుద్ది చెబుతారని, ఎన్నికల ముందు బొండా కట్ చేస్తున్నాడని అన్నారు. అంబటి విషయంలో చట్టం కాకెత్తుకుపోయిందని ఫైర్ అయ్యారు. నాపై పెట్టిన కేసే మళ్ళీ పెట్టారని, గుండెలు పగిలిపోతున్నాయన్నారు. నన్ను వంద సార్లు అరెస్ట్ చేసిన వెనకడుగు వేయని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.
Also Read: మరో వేటకు సిద్ధమవుతున్న హైడ్రా.. 176 కాలేజీలపై హైడ్రా అధికారులు గురి!