Vande Mataram: 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు CWC మరోసారి ఫాలో అవుతామని ప్రకటన చేసింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలకే పరిమితం కావాలని డిసైడ్ అయింది. ఇది కొత్త నిర్ణయం కాదు, చారిత్రక తీర్మానమే అన్నది కాంగ్రెస్ వాదన.
Also Read: ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?
కానీ బీజేపీ మాత్రం ఇదే నిర్ణయాన్ని అస్త్రంగా మలుచుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాంగ్రెస్ను కొత్త ముస్లింలీగ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షా కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని యాంటీ-నేషనల్ అంటూ మండిపడ్డారు. అయితే అసలు ప్రశ్న.. వందేమాతరం విషయంలో చారిత్రక నిర్ణయాన్ని కొనసాగించడం తప్పా? లేదంటే బీజేపీ అన్నట్లు ఇది జాతి వ్యతిరేకమా? ఏది కరెక్ట్? ఏది రాంగ్?? వందేమాతరం చుట్టూ రగులుతున్న ఈ మంటలు ఎటు దారితీయబోతున్నాయ్?