E10 Petrol: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా E20ని స్టాండర్డ్ పెట్రోల్గా మార్చారు. అయితే ముఖ్యంగా పాత వాహనాల మైలేజ్, పర్ఫార్మెన్స్ పై వాహనదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయ్. ఫ్యూయెల్ ఇంజెక్టర్లు ఖరాబ్ అవుతున్నాయన్నారు. ఇంజిన్లు మొరాయిస్తున్నాయన్న ఆందోళనలు పెరిగాయ్.
దీంతో పాత వాహనాల కోసం E10ను E20తో పాటు అందించే అవకాశంపై ప్రభుత్వం, ఆటో ఫ్యూయల్ ఇండస్ట్రీ మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు E10ను తిరిగి ప్రవేశపెట్టే తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయ్. నిజానికి జులైలో కేంద్రం E10కి తిరిగి వెళ్లే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.
Also Read: జీవో 97 vs పాలిటెక్నిక్ స్టూడెంట్స్.. రంగంలోకి కేటీఆర్.. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్!
మరోవైపు ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కూడా పాత వాహనాల కోసం E10 ఆప్షన్ ఉండాలని సూచించడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. మరి ప్రజల ఆందోళనల తర్వాత వాహనదారుల కోరిక మేరకే కేంద్రం ఆలోచిస్తోందా? E20 కొనసాగిస్తూనే E10ను తీసుకొస్తారా? ఏం జరుగుతుందో చూడాలి.
Also read: పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!