Digital Politics: తరాలు మారుతున్నాయి. స్వరాలు వినిపించే వేదికలు కూడా మారుతున్నాయి. రాజకీయ పార్టీల వాయిస్ బహిరంగ సభల నుంచి సెల్ఫోన్ స్క్రీన్లకు షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ మైకులు కాదు.. లైకులే ఇంపార్టెంట్.
జెన్ జీ చూపించిన డిజిటల్ పవర్..
జెన్ జీ చూపించిన డిజిటల్ పవర్.. రాజకీయాల్లో కొత్త ప్రచార శకానికి నాంది పలకింది. మైకుల సౌండ్ కంటే వర్టికల్ రీల్స్కే యూత్ కనెక్ట్ అవుతున్నారని పసిగట్టిన లీడర్లు.. ప్రచార రూటే మార్చేశారు. జెన్జీని చేరుకోవాలంటే.. వాళ్ల ప్లాట్ఫామ్లోనే మాట్లాడాలన్నది నేతల కొత్త లెక్క. అందుకే ప్రధాని మోదీ ఏకంగా ఆరుసార్లు ఇన్స్టా రీల్స్ పోస్ట్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ సైతం ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ ఇన్ స్టాలో యూత్తో ముచ్చట్లు పెడుతున్నారు. యూత్ ఎక్కువగా ఎప్పుడు రీల్స్ చూస్తున్నారు. ఎప్పుడు ఖాళీగా ఉంటున్నారని ఆరా తీసి మరీ అదే టైమ్కి వీడియోలను వదులుతున్నారు. రాత్రి 9 గంటల తర్వాతే ఈ డిజిటల్ వీడియోలను అప్లోడ్ చేస్తూ… యంగ్ ఓటర్ల అటెన్షన్ను గ్రాబ్ చేస్తున్నారు. మరి ఈ రీల్స్ రాజకీయం ఎంతవరకు వర్కవుట్ అవుతుంది? ఒక్క వైరల్ వీడియో ఓటును మార్చగలదా? లైక్స్ ఓట్లుగా మారతాయా?