Hospital Negligence: అది 2020 నవంబరు 30.. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అఖిలేష్ కుమార్తె అన్షిక ఆడుకుంటూ సడెన్గా రూపాయి కాయిన్ మింగేసింది. కంగారుపడిన తల్లిదండ్రులు బంజారాహిల్స్ లోని రెనోవా N.I.G.L ఆసుపత్రి తలుపు తట్టారు. ట్రీట్మెంట్ ముందు మా పాప అన్నం తినింది, అరటిపండ్లు తినిపించామని తల్లిదండ్రులు నోత్తినోరు మొత్తుకున్నారు. అవేవి పట్టించుకోకుండా ఎండోస్కోపీ చేశారు.
ఆ సమయంలో చిన్నారి వాంతులు చేసుకోవడంతో ఆహారం ఊపిరితిత్తుల్లోకి చేరి ఆ పసికందుకు ఊపిరి ఆడలేదు. మెదడుకు పది నిమిషాల పాటు ఆక్సిజన్ అందక కోమాలోకి జారుకుంది. 72 గంటల్లో కోలుకుంటుందని చెప్పిన ఆ డాక్టర్ల మాటలు కలగానే మిగిలిపోయాయి. 100 శాతం శాశ్వత వైకల్యంతో ఇప్పటికే మంచానికే పరిమితమైంది.
న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కారు. సుదీర్ఘ విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్-2… ఆసుపత్రి చేసిన ఘోరమైన నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. WHO ప్రమాణాలు పాటించకుండా ఓ పాప జీవితాన్ని నాశనం చేసినందుకు కోటి 77 లక్షల జరిమానా విధించింది. ఇక్కడ ప్రశ్న పరిహారం గురించి కాదు.. బాధ్యత గురించి. డాక్టర్ చేతిలో ప్రాణాలు పెడుతున్న ప్రతి కుటుంబానికి భద్రతపై హామీ ఎవరు ఇస్తారు? ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తే… ఆ నష్టాన్ని ఏ పరిహారం భర్తీ చేయగలదు?