E-Paper
Advertisement

రూపాయి కాయిన్ మింగిన చిన్నారి.. ఆపై కోమాలోకి.. రెనోవా ఆస్పత్రి ఘోర నిర్లక్ష్యం!

రూపాయి కాయిన్ మింగిన చిన్నారి.. ఆపై కోమాలోకి.. రెనోవా ఆస్పత్రి ఘోర నిర్లక్ష్యం!
Advertisement

Hospital Negligence: అది 2020 నవంబరు 30.. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అఖిలేష్ కుమార్తె అన్షిక ఆడుకుంటూ సడెన్‌గా రూపాయి కాయిన్ మింగేసింది. కంగారుపడిన తల్లిదండ్రులు బంజారాహిల్స్‌ లోని రెనోవా N.I.G.L ఆసుపత్రి తలుపు తట్టారు. ట్రీట్‌మెంట్‌ ముందు మా పాప అన్నం తినింది, అరటిపండ్లు తినిపించామని తల్లిదండ్రులు నోత్తినోరు మొత్తుకున్నారు. అవేవి పట్టించుకోకుండా ఎండోస్కోపీ చేశారు.

ఆ సమయంలో చిన్నారి వాంతులు చేసుకోవడంతో ఆహారం ఊపిరితిత్తుల్లోకి చేరి ఆ పసికందుకు ఊపిరి ఆడలేదు. మెదడుకు పది నిమిషాల పాటు ఆక్సిజన్ అందక కోమాలోకి జారుకుంది. 72 గంటల్లో కోలుకుంటుందని చెప్పిన ఆ డాక్టర్ల మాటలు కలగానే మిగిలిపోయాయి. 100 శాతం శాశ్వత వైకల్యంతో ఇప్పటికే మంచానికే పరిమితమైంది.

Advertisement

న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కారు. సుదీర్ఘ విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్-2… ఆసుపత్రి చేసిన ఘోరమైన నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. WHO ప్రమాణాలు పాటించకుండా ఓ పాప జీవితాన్ని నాశనం చేసినందుకు కోటి 77 లక్షల జరిమానా విధించింది. ఇక్కడ ప్రశ్న పరిహారం గురించి కాదు.. బాధ్యత గురించి. డాక్టర్ చేతిలో ప్రాణాలు పెడుతున్న ప్రతి కుటుంబానికి భద్రతపై హామీ ఎవరు ఇస్తారు? ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తే… ఆ నష్టాన్ని ఏ పరిహారం భర్తీ చేయగలదు?

Tags

Related News

ఏపీ మంత్రిపై ఎన్నారై మహిళ ఫిర్యాదు.. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?

రెండు రాష్ట్రాలు సై.. కేంద్రం మాత్రం నై.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ పై కేంద్రం మతలబేంటో!

తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటల.. నకిలీ నవ్వులేనా.. లోపల పాత పగలున్నాయా..!

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. కాంగ్రెస్ వేసిన ట్రిపుల్ సర్వే స్కెచ్ వర్కౌట్ అయ్యేనా..!

పార్లమెంట్‌లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!

వైరల్ కావడం కోసం ఏమైనా చేస్తారా.. టాలీవుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మైండ్ బ్లాకింగ్ డ్రామాలు!

ఏపీ ప్రజల పదేళ్ల కన్నీళ్లకు ముగింపు లభిస్తుందా.. అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియపై అసలు నిజాలివే!

Big Stories

Advertisement
×