బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Navy Operation: ఇండియన్ నేవీ సాహసానికి అంతర్జాతీయ ప్రశంసలు.. విదేశీ నౌకకు ఊపిరిపోసిన భారత్!

Navy Operation: ఇండియన్ నేవీ సాహసానికి అంతర్జాతీయ ప్రశంసలు.. విదేశీ నౌకకు ఊపిరిపోసిన భారత్!

Navy Operation: ఇండియన్ నేవీ ఓ రిస్కీ ఆపరేషన్ చేపట్టింది. షిప్‌లో పేలకుండా ఉండిపోయిన మిసైల్ వార్ హెడ్ ను రిమూవ్ చేసింది. ఈ రిస్కీ ఆపరేషన్ ఎలా సాగిందో ఓసారి చూద్దాం. మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న MT ఒలింపిక్ లైఫ్ ట్యాంకర్, యూఏఈలోని ఫుజైరా నుంచి కేరళ కొచ్చికి వస్తుండగా, మే 26న ఒమన్ తీరంలో దీనిపై మిసైల్ అటాక్ జరిగింది. ఈ దాడిలో మిసైల్.. నేరుగా నౌక వెలుపలి భాగాన్ని చీల్చుకుంటూ లోపలికి దూసుకెళ్లింది. అది చాలా కంపార్ట్‌మెంట్లను దాటుకుని నేరుగా నౌకలోని ప్రధాన ఇంధన నిల్వ ట్యాంకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అదృష్టవశాత్తూ ఆ వార్‌హెడ్ అక్కడ పేలలేదు. నౌకలో ఎలాంటి భారతీయ సిబ్బంది లేనప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన ఈ స్థితిలోనే ఈ ట్యాంకర్ కొచ్చి వైపు అదే కండీషన్ లో తన ప్రయాణాన్ని కొనసాగించింది.

హైరిస్కీ ఆపరేషన్..

ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్.. ఇండియన్ ఓషన్ రీజన్ ద్వారా భారత నేవీకి ఈ సమాచారం అందింది. దీంతో కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్ వెంటనే రంగంలోకి దిగి, ఒక ప్రత్యేక ఎక్స్‌ప్లోజివ్ ఆర్డ్నెన్స్ డిస్పోజల్ టీమ్‌ను ఈ హైరిస్కీ ఆపరేషన్ కోసం పంపింది. సో ఈ ఆపరేషన్ ఎలాంటిదంటే టైం బాంబు లాంటి పరిస్థితి. ఇంధన ట్యాంకు దగ్గర ఈ పేలని వార్‌హెడ్ ఉండటం వల్ల ఏ నిప్పురవ్వ వచ్చినా భారీ పేలుడుతో ఏదైనా జరిగే ప్రమాదం ఉండేది. కానీ ఇండియన్ నేవీ ఎక్స్ పర్ట్స్.. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరికి వెళ్లి, అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో ఆ క్షిపణి డిటోనేషన్ మెకానిజంను గుర్తించి, దానిని విజయవంతంగా డిసేబుల్ చేశారు.

Also read: Khammam District: ఖమ్మం బాలిక ఘటనలో సంచలనాలు.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..!

అంతర్జాతీయ ప్రశంసలు..

పకడ్బందీ ప్రణాళికతో, ప్రాణాలను పణంగా పెట్టి ఆ వార్‌హెడ్‌ను, దానికి సంబంధించిన శకలాలను ఇంధన ట్యాంకు నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వెలికితీసిన ఆ పేలుడు పదార్థాన్ని నేవీ అధికారులు కొచ్చిలోని ఒక సేఫ్టీ రక్షణ కేంద్రానికి తరలించారు. అంతర్జాతీయ సిబ్బంది ఉన్న ఈ విదేశీ నౌకను, కొచ్చి తీరంలో ముప్పు నుంచి కాపాడటంలో ఇండియన్ నేవీ సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి, సాంకేతిక నైపుణ్యం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటుంటోంది.

Storey By: Anup Big Tv

Also read: ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్.. తర్వాతి టార్గెట్ జగనేనా?

Related News

AP Liquor Scam: ఎపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు కీలక నేతల అరెస్టుతో వైసీపీ గుండెల్లో రైళ్లు!

Khammam District: ఖమ్మం బాలిక ఘటనలో సంచలనాలు.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..!

Vizag Tragedy: ఏపీని వణికిస్తున్న స్టీల్‌ప్లాంట్ వివాదం.. వైఎస్ జగన్ ఓట్ల రాజకీయంపై టీడీపీ ఫైర్!

Sangareddy Murder: కూరగాయల సంచితో కిల్లర్ భర్త బండారం బట్టబయలు.. బొల్లారం హత్యకేసులో సంచలనం!

Bharathiraja Legacy: తెలుగు ఇండస్ట్రీపై భారతీరాజా మార్క్.. కమర్షియల్ హిట్స్‌తో రియలిస్టిక్ పిక్చర్స్ ఇచ్చిన మేధావి..!

Amaravati Projects: ఏపీ రాజధానిలో ఢిల్లీ లెవెల్ రాజకీయం.. 22 ఎకరాల్లో కేంద్రం వేస్తున్న భారీ స్కెచ్ ఇదే..?

Mohan Naik: ఏసీబీ చరిత్రలోనే మోస్ట్ కాస్ట్‌లీ తిమింగలం..కాంట్రాక్టర్ల రక్తం తాగడం ఆయన నైజం..?

×