E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Land Controversy: మధ్యప్రదేశ్‌ సీఎంకు బిగుసుకున్న ఉచ్చు.. రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్!

Land Controversy: మధ్యప్రదేశ్‌ సీఎంకు బిగుసుకున్న ఉచ్చు.. రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్!
Advertisement

Land Controversy: మధ్యప్రదేశ్‌ సీఎం ఉజ్జయినిలో 168 ఎకరాలు కొన్నారా? సంచలన మీడియా కథనాలు ఏం చెబుతున్నాయి? ఇందుకు తగిన ఆధారాలు ఎలాంటివి? ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలేంటి? దీనిపై సీఎం ఫ్యామిలీ రియాక్షనేంటి? అధికార బీజేపీ స్పందనేంటి? మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యుల భూముల కొనుగోళ్ల వ్యవహారంపై ఒక జాతీయ పత్రిక సంచలన ఆరోపణలు చేసింది. ఇదిప్పుడు ఎంపీ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా పెను దుమారం చెలరేగేలా చేస్తోంది. 2023 డిసెంబర్ లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు మోహన్ యాదవ్. ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత ఆయన సోదరుడు, భార్యా పిల్లలు, వారితో సంబంధమున్న కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు.. ఉజ్జయిన్ ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగులు చేసినట్టు చెబుతోందీ మీడియా రిపోర్ట్.

సీఎం మోహన్ యాదవ్..

సీఎం మోహన్ యాదవ్ ఫ్యామిలీ మొత్తం 168 ఎకరాల విస్తీర్ణంలో 137 ప్లాట్లను కొన్నట్టుగా.. ఈ పత్రాల ద్వారా తెలుస్తోందని అంటోందీ పత్రిక. 2028లో ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా జరగబోతోంది. ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన చేస్తుంది. హైవేలు, టౌన్ షిప్ లు, మెడికల్ సిటీ, నదీతీర ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. సరిగ్గా ఈ మాస్టర్ ప్లాన్ పరిధిలోనే భూముల కొనుగోళ్లు జరిగాయన్నది అసలు ఆరోపణ. సీఎం మోహన్ యాదవ్ కుటుంబం కొన్న ఈ భూముల్లోని 111 ఎకరాల్లో కొత్త రోడ్ నెట్ వర్క్, బైపాస్ రూట్స్ ప్లాన్ చేశారు. ఇందువల్ల ఈ భూముల విలువ రాత్రికి రాత్రే వందల రెట్టు పెరిగే అవకాశముంది. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగంగా భావిస్తున్నారు. అంటే ఇక్కడిలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్టులు వస్తాయని ముందే తెలిసి ముఖ్యమంత్రి కుటుంబం ఈ ప్రాంతాల్లో అతి తక్కువ ధరలకు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఉంటారన్న విమర్శలు వినవస్తున్నాయి.

Advertisement

Also read: SpaceX Crash: ఎలాన్ మస్క్‌కు ఇన్వెస్టర్లు గట్టి షాక్.. స్పేస్‌ఎక్స్ షేర్లు పడిపోవడానికి అసలు కారణం ఇదే!

పాలిటిక్స్‌లో తీవ్ర కలకలం..

ఈ నివేదిక బయటకొచ్చిన వెంటనే ఎంపీ పాలిటిక్స్‌లో తీవ్ర కలకలం చెలరేగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూను మరింత హైలెట్ చేస్తోంది. సీఎం మోహన్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ ఆరోపణలపై ఇప్పటి వరకూ సీఎంఓ కానీ, బీజేపీ అధిష్టానం నుంచి కానీ స్పందన రాలేదు. ఈ అవినీతి ఆరోపణలు వచ్చే రోజుల్లో మరిన్ని మలుపులు తిరగొచ్చని కూడా భావిస్తున్నారు.

Advertisement

Storey By: Aoppa rao Big Tv

Also read: Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. !

Related News

Pune Crime: పూణే బిజినెస్ మ్యాన్ హత్యకేసులో సంచలనం.. వెలుగులోకి మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు!

TMC Revolt: 28 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాభవం.. మమతకు ఊహించని దెబ్బ..!

Iran Sanctions: వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ..!

SpaceX Crash: ఎలాన్ మస్క్‌కు ఇన్వెస్టర్లు గట్టి షాక్.. స్పేస్‌ఎక్స్ షేర్లు పడిపోవడానికి అసలు కారణం ఇదే!

NDA Strategy: ఢిల్లీ పాలిటిక్స్‌లో జెట్ స్పీడ్ ట్విస్టులు.. ఈ సారీ విపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా బిల్లు..?

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సెల్లార్‌లో లభించిన ఆ రహస్యాలు అవేనా..?

Monsoon Deficit: 146 ఏళ్లలో ఎన్నడూ లేని మహా ఘోరం.. లోటు వర్షపాతంతో వణికిపోతున్న భారతదేశం..!

Big Stories

×