Nepal Floods: చైనా నుంచి మరో హెచ్చరిక వచ్చింది. విపత్తు తర్వాత ఏర్పడిన సరస్సులో నీటి రంగు ముదురు రంగులోకి మారుతోందని, ఇది సరస్సు బద్దలయ్యేందుకు ప్రధాన సూచన అని చైనా అధికారులు.. నేపాల్ విదేశాంగ శాఖను అప్రమత్తం చేశారు. చైనా వైపున చోచెన్ నది, నేపాల్ వైపున పురెపు నది కలిసే ప్రాంతంలో ఏర్పడిన ఈ సరస్సులో.. నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఫ్లడ్ మోడలింగ్ రీసెర్చ్ ప్రకారం.. గరిష్టంగా సెకనుకు 500 క్యూబిక్ మీటర్ల ప్రవాహం ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇప్పటివరకు ఈ ప్రకృతి విలయంలో.. మృతుల సంఖ్య 700 దాటింది. 2,400 మందికి పైగా గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. ఆకస్మిక వరదలు సంభవించిన 4 రోజుల తర్వాత.. చైనా సహాయక బృందాలు గిరాంగ్ వలస కేంద్రానికి చేరుకున్నాయ్. కైలాస యాత్రకు వెళ్తున్న కొందరు భారతీయ యాత్రికులు మధ్యలోనే ఉన్నారు. వరదల్లో చిక్కుకున్న 84 మంది భారతీయులను రక్షించారు. ఇంకా 320 మంది భారతీయుల ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో 400 మంది చైనా వైపు చిక్కుకుపోయారు.
Also read: మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ
మొదట్లో విదేశీ సహాయాన్ని తిరస్కరించిన నేపాల్ ప్రభుత్వం.. దౌత్యపరమైన ఒత్తిళ్లు, గల్లంతైన వారిలో విదేశీయులు ఉండటంతో వెనక్కి తగ్గింది. సొరంగాల్లో రక్షణ చర్యలు, డీఎన్ఏ, ఫోరెన్సిక్ పరీక్షల కోసం అంతర్జాతీయ నిపుణుల బృందాలను అనుమతించాలని నిర్ణయించింది. మరోవైపు.. భారత్ నుంచి నేపాల్కు అత్యవసర సహాయం అందుతోంది. తాజాగా 10 టన్నుల సహాయక సామగ్రితో పాటు డాక్టర్లు, రెస్క్యూ సిబ్బందితో కూడిన మూడో విమానం నేపాల్కు చేరుకుంది. విపత్తుతో ఏర్పడిన కొత్త సరస్సు ముప్పు పొంచివున్న తరుణంలో.. నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో సహాయక చర్యలకు తాత్కాలికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. వేలాది మంది ఆచూకీ గల్లంతు కావడంతో.. వాళ్లందరినీ కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయ్.
Also read: విజయ్ – త్రిష రూమర్స్ పై నోరు విప్పిన సంజనా.. “వాళ్ళపర్సనల్ లైఫ్ తో మీకేంటి పని?”