E-Paper
Advertisement

అమిత్ షా ను వెంటాడుతున్న రాహుల్‌! పెల్లెట్ గ‌న్ బాధితుడితో క‌లిసి పోరాటం.. విద్యార్థుల‌పై లాఠీ ఎత్తాలంటేనే జంకుతున్న కేంద్రం..

అమిత్ షా ను వెంటాడుతున్న రాహుల్‌! పెల్లెట్ గ‌న్ బాధితుడితో క‌లిసి పోరాటం..  విద్యార్థుల‌పై లాఠీ ఎత్తాలంటేనే జంకుతున్న కేంద్రం..
Advertisement

నిను వీడ‌ని నీడ‌ను నేనే.. అన్న‌ట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వ‌ద‌ల‌డం లేదు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ పార్టీ ఆందోళ‌న ఉద్రిక్తంగా మారిన నాటి నుంచి అమిత్ షాను టార్గెట్ చేస్తున్నారాయ‌న‌. విద్యార్థుల‌పై లాఠీ చార్జి చేయ‌డ‌మే కాదు.. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ర‌బ్బ‌ర్ బుల్లెట్లు వాడి వారిని గాయ‌ప‌రిచారు. దీనిపై రాహుల్ అప్ప‌టి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు.

పెల్లెట్ గ‌న్ దెబ్బ‌కు త‌న చూపు కోల్పోయిన విద్యార్థితో క‌లిసి ఇవాళ‌ ఉద‌యం నుంచి ఢిల్లీలో ఆందోళ‌న చేశారు రాహుల్‌. బాధిత విద్యార్థి ఫిర్యాదు చేసినా ఎందుకు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని పోలీసులపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌ త‌ప్ప‌లేదు పోలీసుల‌కు.

Advertisement

మొన్న పార్ల‌మెంటులో అమిత్ షాను నిల‌దీసే క్రమంలో చేసిన ఇండి కూట‌మి పోరాటం ఫ‌లించింది. స‌భ‌కు హాజ‌రు కాకుండా త‌ప్పించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది కేంద్ర మంత్రికి. స‌భ‌కు రావాల‌ని, క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, రాజీనామా చేయాల‌ని రాహుల్ చేసిన పోరాటం.. బీజేపీ పెద్ద‌ల‌ను ఇబ్బంది పెట్టింది. ఇక‌పై జంత‌ర్ మంత‌ర్ వ‌ద్దే కాదు.. ఢిల్లీలో ఎక్క‌డ యువ‌త ఆందోళ‌న చేసినా.. విద్యార్థులు ఎక్క‌డ రోడ్డెక్కినా లాఠీలు ఎత్తాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితిని క్రియేట్ చేశారు రాహుల్ గాంధీ.

ఆది నుంచి ఆయ‌న జెన్‌జీల‌కు మ‌ద్ద‌తుగానే ఉంటూ వ‌స్తున్నారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్ననాటి నుంచి త‌న సంఘీభావం తెలుపుతూ వ‌స్తున్నారు. పార్ల‌మెంటు ముట్ట‌డి ఉద్రిక్తంగా మారిన త‌రుణంలో వారికి అండగా ఉండి .. కాంగ్రెస్ కూట‌మితో క‌లిసి మెరుపు ధ‌ర్నా చేసి యువ‌తకు మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌య్యారు.

Advertisement

ఏ వేదిక మీదెక్కినా ఈ అంశాన్ని వ‌ద‌ల‌డం లేదు రాహుల్‌. అమిత్ షాను వెంటాడుతూనే ఉన్నారు. ఇప్ప‌టికీ రాజీనామా చేయాల‌నే డిమాండ్‌ను స‌జీవంగానే ఉంచుతున్నారు. అమిత్ షా దీన్ని మ‌రిచిపోదామ‌ని అనుకున్నా.. మ‌ర‌వ‌నీయ‌కుండా జంత‌ర్ మంత‌ర్ చేదు అనుభ‌వాల‌ను జ్ఞ‌ప్తికి తెస్తూ ఇబ్బంది పెడుతున్నారు.

రాజకీయంగా ఇరుకున పెడుతున్నారు. తాజాగా పెల్లెట్ గ‌న్ బాధితుడి ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డ‌మంటే కేంద్రం త‌న త‌ప్పు ఒప్పుకోవ‌డ‌మే అవుతుంది. రాహుల్ వ్యూహంలో అమిత్ షా, మోడీ ద్వ‌యం చిక్కుకున్నార‌ని ఈ ఉదంతం తెలియ‌జేస్తోంది.

Tags

Related News

ఏనుగు చర్మం తరహాలో.. సరికొత్త టైల్స్, ఇల్లంతా కూల్ కూల్!

సంచలన నిర్ణయం తీసుకున్న టీబీజేపీ.. కాంగ్రెస్ సర్కార్‌పై ‘జెన్ జీ’ అస్త్రం.. వర్కౌట్ అయ్యేనా..!

రోడ్డుపైకి బండి తీస్తున్నారా.. ఇక నుంచి బీకేర్ ఫుల్.. ఈ కొత్త కెమెరాలు చూస్తే చలాన్ పక్కా పడాల్సిందే!

పొమ్మ‌న‌రు.. పొగ‌బెడ‌తారు.. రెబ‌ల్స్‌పై రేవంత్ మార్క్ దండ‌యాత్ర‌.. ప్ర‌తిప‌క్షాల‌కు చిక్క‌కూడ‌ద‌నే వ్యూహం..

పాలకులు మారినా మారని సరిహద్దు గ్రామాల తలరాత.. అనాథలైన ఆ ఐదు గ్రామాలు

ఫామ్‌హౌజ్‌కు పాద‌యాత్ర‌..! కేసీఆర్ సీఎం కావాల‌ని.. పెద్ద‌సారు వ‌ద్ద‌కే అభిమానులు..!

కూటమిలో ఉంటూనే ఫ్రెండ్లీ ఫైట్.. ఏపీలో బీజేపీ మైండ్ గేమ్‌ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఇదే!

Big Stories

Advertisement
×