Tibet Floods: నేపాల్-టిబెట్ సరిహద్దులో.. గైరాంగ్ పోర్ట్ దగ్గర వచ్చిన ఆకస్మిక వరదలు, బురద ప్రవాహం అన్నింటినీ ముంచెత్తాయి. హిమాలయాల్లో హిమానీనదం విరిగిపడటంతో నీళ్లు, రాళ్లు, బురద కలిసి ఊళ్లపైకి దూసుకొచ్చాయి. నేపాల్లో 700 మందికిపైగా చనిపోయినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. దాదాపు 2,500 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. వేలాది మంది యాత్రికులు, విదేశీ పర్యాటకులు ఈ విపత్తులో చిక్కుకున్నారు. కానీ సరిహద్దుకు ఆవల టిబెట్లో ఏం జరిగిందన్నది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది.
టిబెటన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను చైనా సెన్సార్షిప్ చేసి.. గంటల్లోనే తొలగించిందనే ఆరోపణలు వస్తున్నాయ్. గైరాంగ్ పోర్ట్ను వరద ముంచెత్తుతున్న సీసీటీవీ విజువల్.. వరల్డ్ వైడ్ వైరల్ అయినా, చైనా ఇంటర్నెట్లో మాత్రం అది మాయమైపోయింది. చైనా ప్రభుత్వ టీవీ.. ఆ వీడియో నుంచి ఒకే ఒక్క ఫొటోను మాత్రమే చూపించిందని.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయ్. టిబెట్లో ఐదుగురు చనిపోయినట్టు, 5 వందల మందికి పైగా గల్లంతైనట్టు చైనా అధికారికంగా ప్రకటించింది. వారిలో 260 మంది విదేశీయులు ఉన్నారు. కానీ ఏ ఊళ్లో ఎవరు చిక్కుకున్నారు? ఎవరికి సాయం కావాలన్న కనీస సమాచారం బయటకు రావడం లేదని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ్.
Also read: ప్రీతి జింటాకు వెన్నుపోటు…శ్రేయాస్ అయ్యర్ యూ-టర్న్ ?
టిబెట్లోకి విదేశీ జర్నలిస్టులకు ప్రవేశం లేదు. స్థానికులు కూడా బయటి మీడియాతో స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఉందని హ్యూమన్ రైట్స్ వాచ్ గతంలోనే తెలిపింది. కోవిడ్ సమయంలోనూ చైనా ఇలాంటి సెన్సార్షిప్నే ప్రయోగించిందని గుర్తుచేస్తున్నారు. ఒకవైపు నేపాల్ మాత్రం విదేశీ జర్నలిస్టులను వరద ప్రాంతాల్లోకి అనుమతించి, పారదర్శకంగా వ్యవహరిస్తోంది. మరోవైపు చైనా మాత్రం సైన్యం సహాయక చర్యలు, హెలికాప్టర్ల ఆపరేషన్లను మాత్రమే గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. వరద నీళ్లు తగ్గొచ్చు. కానీ టిబెట్లో ఎంతమంది గల్లంతయ్యారన్న ప్రశ్న మాత్రం మిస్టరీగానే మిగిలిపోతోంది. ఓవైపు వందల మంది గల్లంతయ్యారని నేపాల్, భారత్ ప్రభుత్వాలు ఆందోళన చెందుతుంటే.. చైనా మాత్రం తన ఇమేజ్ కు డ్యామేజ్ కాకుండా చూసుకుంటోంది.
Also read: పుంగనూరులో టీడీపీ ఇంచార్జి మార్పు కలకలం.. వేదికపైనే కన్నీటి పర్యంతమైన చల్లా బాబు!