CMR Rice: CMRలో ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం మిల్లుల్లోనే మాయమవుతోందన్న ఆరోపణలు కొత్తవి కావు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రికవరీ మోడ్ లోకి వెళ్లింది. 2023 నుంచి ధాన్యం అప్పగించిన లెక్క, తిరిగి వచ్చిన CMR మధ్య భారీ తేడాలు గుర్తించడంతో విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ మొదలైంది. తనిఖీలు జరిగాయ్. అక్రమాలు తేలాయ్.
Also Read: ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?
మరోవైపు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్కు చెందిన ARS ఇండస్ట్రీస్పై కూడా కేసు నమోదైంది. 9 వేల 639 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరతగా గుర్తించగా.. ఆ విలువ 40 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న.. ఇంతకాలం CMR మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడుంది? మిల్లర్ల బకాయిలు వందల కోట్లకు చేరే వరకు ఎందుకు వెయిట్ చేశారు? ఇప్పుడు పీడీ యాక్ట్తో భయపెడితేనే ప్రభుత్వ ధాన్యానికి రక్షణ వస్తుందా? లేక పర్మినెంట్ రికవరీ మెకానిజం కూడా అవసరమా? రైతుల ధాన్యంతో జరిగే ఈ వ్యవహారానికి ఇకనైనా ఎండ్ కార్డ్ పడుతుందా? ఇవన్నీ తేలాల్సిన విషయాలు.