AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలంటేనే సామాన్యుడి ఓటు కంటే.. గెలుపు గుర్రాల బేరాలు, కిడ్నాప్లు, గొర్రెల మందలా వ్యాన్లలో క్యాంప్ రాజకీయాలే గుర్తుకొస్తాయి. ఈ ఆచారానికి మంగళం పాడుతూ.. మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులను ప్రజలే నేరుగా ఎన్నుకునే డైరెక్ట్ ఎలక్షన్ పాలసీ తేవాలన్న ప్రతిపాదన వినిపిస్తోంది.
అధికార ఫీఠాల కోసం రక్తపాతాలు..
ప్రజాతీర్పును పక్కనపెట్టి.. గెలిచిన నాయకులను కోట్లు పెట్టి కొనుక్కోవడం, అధికార పీఠాల కోసం రక్తపాతాలు సృష్టించడం.. ఇదేనా మనకు కనిపించే స్థానిక ప్రజాస్వామ్యం. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పగలు, ప్రతీకారాలు, అవిశ్వాస తీర్మానాల రచ్చతో అభివృద్ధి అటకెక్కుతుంది.
నేరుగా ప్రజలే చైర్మన్లను ఎన్నుకుంటే..?
నేరుగా ప్రజలే చైర్మన్లను ఎన్నుకుంటే, ఐదేళ్ల పాటు ఏ రాజకీయ శక్తులు వారిని ఏమీ చేయలేవు. కానీ, సొంత మంత్రుల్లోనే కొందరు దీనికి వంకలు పెడుతున్నారు. పరిపాలనలో సమన్వయం దెబ్బతింటుదని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చితో 87చోట్ల పాలకవర్గాల పదవీకాలం ముగియబోతుంది. అంతకుముందే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?