E-Paper
Advertisement

Unified Pension Scheme: యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌.. ఏప్రిల్‌ ఒకటి నుంచి వారికి మాత్రమే

Unified Pension Scheme: యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌.. ఏప్రిల్‌ ఒకటి నుంచి వారికి మాత్రమే

Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి యూపీఎస్‌ పథకం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి శనివారం రాత్రి ఆర్థికశాఖ గెజిట్‌ను విడుదల చేసింది. జాతీయ పెన్షన్‌ వ్యవస్థ (యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌-యూపీఎస్‌) పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తించనుంది.

దీని ప్రకారం ఉద్యోగులు రిటైర్మెంట్‌కు ముందు 12 నెలల్లో పొందిన బేసిక్ పే సగటులో 50 శాతాన్ని పింఛనుగా పొందేందుకు వీలు కలుగుతుంది. కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని యూపీఎస్‌ను ఎంచుకున్న వారిని మాత్రమే ఇది వర్తించనుంది. పాత పెన్షన్‌ పథకం-ఓపీఎస్‌-ఎన్‌పీఎస్ కలిపి గతేదాడి యూపీఎస్‌ను ప్రవేశపెట్టింది.

ఓపీఎస్‌ తరహాలో యూపీఎస్‌ కూడా పదవీ విరమణ అనంతరం గ్యారెంటీ పెన్షన్‌ ఆఫర్‌ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై చాన్నాళ్లుగా సందిగ్ధత సాగుతూ వస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొత్త పన్ను విధానం అమలు ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతోపాటు కొన్నిచోట్ల పాత పన్ను విధానం సాగించాలని కొన్ని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. అనేక రకాలుగా ఆలోచించిన కేంద్రం, సరికొత్త ఆలోచనలో ముందుకొచ్చింది.

సర్వీస్ నుంచి తొలగించబడినవారు, రాజీనామా చేసిన ఉద్యోగులకు అందుబాటులో ఉండబోదని సమాచారం. కనీస నెలవారీ పెన్షన్ రూ.10,000 ఉంటుంది. ఒకవేళ 25 ఏళ్ల సర్వీస్ పదవీ విరమణను తీసుకుంటే పరిస్థితి ఏంటి? సర్వీస్ ప్రకారం ఎప్పుడు పదవీ విరమణ ఉంటుందో అప్పటి నుంచి పెన్షన్ చెల్లించబడుతుందన్న మాట.

ALSO READ: బడ్జెట్ 2025-26.. ప్రజల వినియోగశక్తి పెంచడమే కీలకం

పెన్షన్ పొందుతున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే.. చనిపోవడానికి ముందు, చెల్లింపుదారునికి అనుమతించబడే చెల్లింపులో 60 శాతం కుటుంబం చెల్లింపుకు అర్హత పొందుతుంది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న జీవిత భాగస్వామికి మాత్రమే అందించబడుతుంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×