E-Paper
Advertisement

OnePlus 9, 10 Pro Defect: వన్ ప్లస్ 9, 10 ప్రో ఫొన్లలో భారీ సమస్యలు.. రిపేరు ఖర్చు రూ.42000!

OnePlus 9, 10 Pro Defect: వన్ ప్లస్ 9, 10 ప్రో ఫొన్లలో భారీ సమస్యలు.. రిపేరు ఖర్చు రూ.42000!
Advertisement

OnePlus 9, 10 Pro Defect| వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన యూజర్లు కొత్త టెక్నికల్ సమస్యలతో సతమవుతున్నారని సమాచారం. కొత్త ఫీచర్స్ తో లాంచ్ అయిన వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 10 ప్రో సిరీస్ స్మోర్ట్ ఫోన్స్ ల మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. చాలామంది ఫోన్లు ఓవర్ హీట్ కావడం, ఫోన్లు హ్యాంగ్ కావడం, అనుకోకుండా షట్ డౌన్ కావడం వంటి సమస్యలు ఒక్కసారిగా ఎదురవుతున్నాయని తెలిసింది. కొంతమందికైతే ఫోన్ ఆన్ లో ఉన్నా స్క్రీన్ బ్లాక్ గా కనిపిస్తోందట.

అయితే ఈ సమస్యలకు మూల కారణం మదర్ బోర్డ్ లో ప్రాబ్లమ్ కావడంతో దాన్ని రిపేరు చేయడానికి రూ.42000 ఖర్చు అవుతుందని.. తెలిసింది. అయితే ఈ సమస్యలపై ఇంతవరకు వన్ ప్లస్ కంపెనీ పరిష్కారం చూపలేదు. పైగా కంపెనీ అధికారుల సమస్య పట్ల స్పందించపోవడం గమనార్హం.

Advertisement

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన యూజర్లు సోషల్ మీడియాలో వన్ ప్లస్ క్లబ్ పేరుతో గ్రూపుగా ఏర్పడి కొత్త ఫోన్లలో తాము తరుచూ ఎదుర్కొంటున్న సమస్యలు, వన్ ప్లస్ కంపెనీ ఈ సమస్యలపై మౌనంగా ఉండడంపై విమర్శలు చేస్తున్నారు. పైగా వన్ ప్లస్ కమ్యూనిటీ వెబ్ సైట్ లో యూజర్లు తమకు ఎదురైన సాఫ్ట్ వేర్ సమస్య వల్ల మదర్ బోర్డ్ డ్యామేజ్ అయిందని లబోదిబోమంటున్నారు.

గతంలో కూడా ఇలాగే వన్ ప్లస్ 8 సిరీస్ యూజర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. వన్ ప్లస్ 8 లో యూజర్లకు గ్రీన్ లైన్ ప్రాబ్లమ్ వచ్చింది. కానీ అప్పుడు వన్ ప్లస్ కంపెనీ ఈ గ్రీన్ లైన్ సమస్య వచ్చిన వారికి ఉచితంగా కొత్త స్క్రీన్లు ఇచ్చింది. అయితే అదే గ్రీన్ లైన్ సమస్య వన్ ప్లస్ నార్డ్ 4 లో తలెత్తింది.

Advertisement

మరోవైపు వన్ ప్లస్ రీసెంట్ గా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్స్ తో వన్ ప్లస్ నార్డ్ 4 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ విడుదల చేసింది. దీంతో యూజర్లకు వన్ ప్లస్ నార్డ్ 4, వన్ ప్లస్ నార్డ్ సిఈ 4 లైట్ 4జీ స్మార్ట్ ఫోన్లు ఏఐ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.

ఈ కొత్త ఏఐ స్మార్ట్ ఫోన్లలో సైడ్ బార్ లో ఒక ఏఐ టూల్ కిట్ ఉంటుంది. అందులోని ఏఐ ఫంక్షన్ నింగ్ కేవలం అవసరమైనప్పుడు మాత్రమే అపియర్ అవుతుంది. ఉదాహరణకు ఫోన్ లోని ఏఐ స్పీక్ ఫీచర్ ఒక వెబ్ పేజ్ లో కనీసం ఉండాల్సిన టెక్స్ ట్ ఉన్నప్పుడే పనిచేస్తుంది.

జూలై నెలలోనే ఈ ఏఐ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లు లాంచ్ ప్లాన్ చేసుకున్న వన్ ప్లస్ కంపెనీ.. డివైస్ లో ఏఐ ఫీచర్లు పొందుపరచడానికి టెక్నికల్ గా ఆలస్యం కావడంతో ఆగస్టు లో లాంచ్ చేసింది. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. నార్డ్ సిఈ 4 లైట్ 4జీ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. అదే నార్డ్ 4 స్మార్ట్ ఫోన్లు .. యూరోప్, ఇండియా, ఏషియా పసిఫిక్, మిడిల్ ఈస్ట, ఆఫ్రికా, రష్యా, లాటిన్ అమెరికా, సౌత్ ఏషియా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.

Also Read:  నెలకు రూ.1.28 కోట్లు ఆఫీస్ రెంటు!.. బ్లాక్ రాక్ కంపెనీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×