BigTV English
Advertisement

Bus Accident: ట్యాంకర్ ను ఢీకొట్టి వంతెన పై నుంచి ఎగిరి పడ్డ బస్సు, ఐదుగురు స్పాడ్ డెడ్!

Bus Accident: ట్యాంకర్ ను ఢీకొట్టి వంతెన పై నుంచి ఎగిరి పడ్డ బస్సు, ఐదుగురు స్పాడ్ డెడ్!

Kakori Bus Accident:

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారికోరిలో రాత్రి 11 గంటల సమయంలో అతి వేగంగా వెళ్లిన బస్సు బీభత్సం సృష్టించింది. వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టి.. వంతెన మీది నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఐదుగురు ప్రయాణీకులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.  విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

నిన్న సాయంత్రం(సెప్టెంబర్ 11) బస్సు హార్డోయ్ నుంచి లక్నోకు బయల్దేరింది. కారికోరికి చేరుకోగానే బస్సును డ్రైవర్ మరింత వేగంగా నడిపాడు. అక్కడున్న వంతెన మీదికి చేరగానే బస్సు కంట్రోల్ తప్పింది. మందు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. బస్సు వేగం ఎక్కువగా ఉండటంతో ఎగిరి వంతెన మీది నుంచి 20 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణీకులు అక్కడిక్కడే చనిపోయారు. 10 మందికిపైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సహాయక చర్యలను పర్యవేక్షించిన లక్నో డీఎం, సీపీ

ఈ ప్రమాద విషయం తెలియగానే లక్నో డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ విశాఖ్, పోలీస్ కమీషనర్ అమరేంద్ర సింగ్ సెంగర్ స్పాట్ కు చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిఒంచారు. గాయపడిని వారిని కారికోరిలోని హాస్పిటల్ కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సహాయక చర్యల్లో కారికోరి పోలీసులతో పాటు మలిహాబాద్ పోలీసులు, స్థానిక అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదంలో ఐదుగురు చనిపోవడంతో పాటు 10 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.


బస్సు ప్రమాదంపై సీఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి

అటు కారికోరి బస్సు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జిల్లా అధికారులను స్పాట్ కు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను అదేశించారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు లక్నో  పోలీస్ కమీషనర్ అమరేంద్ర సింగ్ సెంగర్ తెలిపారు. విచారణ మొదలు పెట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also:  వ్యభిచారం కేసులో విటులు కూడా నేరం చేసినట్టే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Related News

Crime in Flight: విమానంలో మెటల్ ఫోర్క్‌తో ఇద్దరిని పొడిచాడు.. సిబ్బంది అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటకీ..?

Travel Bus Burnt: ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్దం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Acid Attack Case New Twist: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో కీలక మలుపు, బాధితురాలి తండ్రి అరెస్ట్

Medak News: కర్నూల్ బస్సు ప్రమాదం.. 3రోజుల తర్వాత తల్లీకూతుళ్ల అంత్యక్రియలు, స్థానికుల కంటతడి

Kurnool Bus Accident: వీడని మృత్యువు.. కర్నూలు మృతుల అంత్యక్రియలకు వెళ్లొస్తూ..

Cyber Crime: ముగ్గురు సోదరీమణుల ఏఐ జనరేటేడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు!

Shocking Video: పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు.. కాపాడే ప్రయత్నంలో

Delhi Crime: ప్రియుడిని దారుణంగా ప్లాన్ చేసి హత్య చేసిన ప్రియురాలు.. చివరకు ఏమైందంటే?

Big Stories

×