E-Paper
Advertisement

Crime News: హైదరాబాద్, ట్యాంక్‌బండ్ నడి ఒడ్డున దారుణం.. పసికందును..?

Crime News: హైదరాబాద్, ట్యాంక్‌బండ్ నడి ఒడ్డున దారుణం.. పసికందును..?

Hyderabad Crime News: హైదరాబాద్, ట్యాంక్ బండ్ నడి ఒడ్డున దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నిప్పంటించి తగులబెట్టిన ఘటన జరిగింది. దోమలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

చుట్టు పక్కల స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శ్రీనివాస్‌రెడ్డి క్లూస్‌ టీంను పిలిపించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ స‌హాయంతో సంఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. పలు ఆధారాలు సేకరించిన ఆనంతరం అప్పుడే పుట్టిన ఆడ శిశువుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.

బతికుండగానే పసికందును చంపారా.? మృతిచెందిన పసికందు ఆధారాలు లేకుండా చేసేందుకు ఇక్కడికి తీసుకువచ్చి చంపేశారా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పసికందును ఎందుకు చంపారు..? ఎవరు చంపారు? అనే విషయాలను సీసీ కెమెరాల ఆధారంగా ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Delimitation: అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏమిటి..? దక్షిణాది రాష్ట్రాలకే ఎందుకీ నష్టం..?

ALSO READ: CM Revanth Reddy: యువతకు భారీ గుడ్ న్యూస్.. రూ.4,00,000 స్కీం ప్రారంభించిన సీఎం రేవంత్

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×