E-Paper
Advertisement

Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి!

Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి!

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఘటాల్ గ్రామ సమీపంలో ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, 45మంది గాయపడ్డారు. కాస్గంజ్ జిల్లాలోని 60మంది భక్తులు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా వెనక నుంచి వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో బోల్తా పడిన ట్రాక్టర్‌ను అధికారులు క్రేన్ సహాయంతో తొలగించారు.

ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కంటైనర్ ట్రక్కు ,బోల్తా పడిన ట్రాక్టర్‌

ఈ ఘటన అలీగఢ్ సరిహద్దు సమీపంలో రాత్రి 2:15 గంటల సమయంలో జరిగిందని బులంద్‌షహర్ ఎస్ఎస్‌పీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ట్రక్కు ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడింది.ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 60 మంది ఉన్నారు. వారు కాస్గంజ్ జిల్లాలోని రఫత్‌పూర్ గ్రామం నుండి రాజస్థాన్‌లోని జహర్‌పీర్‌కు తీర్థయాత్ర కోసం ప్రయాణిస్తున్నారిని దినెష్ తెలిపారు.

Also Read: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. గణేష్, దుర్గా మండపాలకు ఉచిత విద్యుత్..

8మంది మృతి,45మందికి తీవ్ర గాయాలు

మృతులు ట్రాక్టర్ డ్రైవర్ బాబు(40), రాంబేటి(65), చాందిని(12), ఘనిరామ్(40), శివాంష్(6), యోగేష్(50), వినోద్(45)గా గుర్తించారు.. వీరు అందరూ కాస్గంజ్ జిల్లా నివాసితులుగా తెలిపారు. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారు.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×