BigTV English

Bengaluru Crime: దారుణం.. చిన్నారిని నీటిలో మరిగించి చంపిన తల్లి

Bengaluru Crime: దారుణం.. చిన్నారిని నీటిలో మరిగించి చంపిన తల్లి
Advertisement

Bengaluru Crime: బెంగళూరులోని నెలమంగళలో గుండెలను కలచివేసే.. దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి తన నెలరోజుల పాపను వేడి నీటిలో మరిగించి హత్య చేసింది. ఇది ఆవేశంలో జరిగిన చర్యా? లేక మానసిక అస్థిరత కారణమా? అనే అనేక ప్రశ్నలు తలెత్తిస్తున్నాయి.


ఘటన వివరాలు
నెలమంగళకు చెందిన రాధ (27) అనే యువతి కొద్దిరోజుల క్రితం బాలికకు జన్మనిచ్చింది. పాప సరిగ్గా పాలు తాగడం లేదని, పదే పదే ఏడుస్తుందని ఆమెకు తీవ్ర మానసిక వేదన కలిగి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం తల్లి రాధ ఆకస్మాత్తుగా.. పాపను వేడినీటిలో మరిగించి దారుణంగా హతమార్చింది. ఇంటి సభ్యులు అప్రమత్తమయ్యేసరికి పాప చనిపోయింది.

పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. రాధను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా రాధ ప్రసవానంతరం.. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతోందని గుర్తించారు. దీనికి సంబంధించి ఆమెకు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (Postpartum Depression – PPD) అనే మానసిక సమస్య.. ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటే ఏమిటి?
పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అనేది తల్లికి బిడ్డ పుట్టిన తరువాత.. కొన్ని వారాల లేదా నెలల తరువాత ఎదుర్కొనే మానసిక వ్యాధి. ఇది శారీరక, భావోద్వేగ, మానసిక స్థాయిల్లో ప్రభావం చూపుతుంది. మామూలుగా ఇది అలసట, ఉదాసీనత, ఒంటరితనంతో మొదలై, తీవ్ర స్థాయిలో ఆత్మహత్యలకు కూడా పాల్పడే ఛాన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో, తల్లి తన బిడ్డ పట్ల కూడా నెగెటివ్ భావనలు కలిగి ఉండవచ్చు. ఈ పరిస్థితిని సరిగ్గా గుర్తించి చికిత్స చేయకపోతే.. ఇలాంటి మానవతా విరుద్ధ ఘటనలు జరగడం ఖాయం.

కేసు నమోదు
రాధపై IPC సెక్షన్ 103 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆమెకు మానసిక చికిత్స అవసరమని భావించి.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె మానసిక స్థితిపై నిపుణుల అభిప్రాయం మేరకు.. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

సామాజిక స్పందన
ఈ ఘటనపై సమాజం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహిళలకు మాతృత్వం తర్వాత వచ్చే భావోద్వేగాలు, ఒత్తిడిని సకాలంలో గుర్తించి, కుటుంబ సభ్యులు అండగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పాప మృతి పట్ల పలువురు మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే విధంగా.. ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: యువతికి మెసేజ్ చేశాడని అడవికి తీసుకెళ్లి.. బట్టలు విప్పి దారుణంగా?

మారవలసిన దృక్పథం
మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల.. ఎలాంటి తీవ్ర పరిణామాలు కలుగుతాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. తల్లులకు మానసికంగా స్థిరపడేలా, పిల్లల పెంపకంలో ఒత్తిడిని తట్టుకోగల శక్తిని అందించేలా.. ఇంట్లో వాళ్ల సహాయంతో పాటు.. ప్రభుత్వ, ఆరోగ్య సంస్థలు పనిచేయాలి.

Related News

Visakha Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. కొబ్బరి బొండాలమ్మే మహిళపైకి దూసుకెళ్లిన లారీ

Telangana Crime: నిజామాబాద్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను పొడిచి పొడిచి చంపిన దొంగ..!

Nims Medico Death: నిమ్స్ ఆపరేషన్ థియేటర్ లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

Madhya Pradesh News: కాలేజీలో యూత్ ఫెస్టివల్.. అమ్మాయిల డ్రెస్సింగ్ రూమ్‌, యువకులు ఏం చేశారంటే

Crime News: ఆస్తి కోసం 3 రోజులుగా తల్లికి అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. ఛీ, వీళ్లు మనుషులేనా?

Hyderabad Crime: బూత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. అద్దెకు దిగిన దంపతులు షాక్, ఇంటి యజమాని అరెస్ట్

Hanumakonda Crime: చీరతో భర్తకు ఉరేసి చంపేసిన భార్య.. వికటించిన లవ్ మ్యారేజ్?

Bengaluru Crime: పట్టపగలు.. నడి రోడ్డుపై యువతి గొంతు కోసి.. దర్జాగా తప్పించుకున్న ఉన్మాది, చూస్తూ నిలబడిపోయిన జనం

Big Stories

×