Visakha Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాక సమతానగర్ సమీపంలో భారీ లారీ అదుపు తప్పింది. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్మే మహిళ(55)పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కొబ్బరి బొండాలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తుంది ఆ మహిళ. ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విశాఖ నగరంలోని ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. విశాఖలోని ఓ కాలేజీలో చదువుతున్న విజయనగరం జిల్లాకు చెందిన వినయ్ అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. స్నేహితులతో కలిసి టూర్ కి వెళ్లి తిరిగి వస్తుండగా, అతని స్నేహితుడు ఉదయ్ నడుపుతున్న బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వినయ్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వినయ్ శుక్రవారం మరణించాడు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఉదయ్కు కూడా గాయాలయ్యాయి.
Also Read: Telangana Crime: నిజామాబాద్లో దారుణం.. కానిస్టేబుల్ను పొడిచి పొడిచి చంపిన దొంగ..!