E-Paper
Advertisement

Bhupalpally: భూపాలపల్లిలో ఘోర ప్రమాదం.. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

Bhupalpally: భూపాలపల్లిలో ఘోర ప్రమాదం.. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. భూపాలపల్లి – కాళేశ్వరం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రెండు బైక్‌లు వేగంగా వచ్చి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.

మృతులను భూపాలపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గాదె మహేష్‌గా.. గణపురం గ్రామానికి చెందిన రెబ్బ శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎదురెదురుగా వస్తున్న వాహనాలు అతివేగంతో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో నర్సింగాపూర్.. గణపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: Viral Video: ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×