BigTV English
Advertisement

Rayagiri Car Accident: లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు మృతి

Rayagiri Car Accident: లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు మృతి

స్వేచ్ఛ, నల్లగొండ బ్యూరో : యాదాద్రిభువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు రాయగిరి వద్ద లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు తెలిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రామ్ తండాకు చెందిన భూక్యా సంతోష్ సంక్రాంతి పండుగ ముగియడంతో గురువారం కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్ పయనమయ్యారు.


ఉదయం 6.30 గంటల సమయంలో రాయగిరి శివారు సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఎలాంటి ఇండికేటర్స్ వేయకుండా పెట్రోల్ బంక్‌వైపునకు తిప్పాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న కారు కంట్రోల్ కాకపోవడంతో లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ వెనుక భాగంలోకి కారు ముందు భాగం దూసుకెళ్లి నుజ్జునుజ్జయ్యింది. కారు ముందు సీటులో కూర్చున్న సంతోష్ భార్య అనూష(28), కూతురు చైత్ర(7) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న భూక్యా సంతోష్, భవాని, రవి, మోక్షకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు తెలిపారు.

Also Read: పండుగపూట విషాదం, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎంత మంది చనిపోయారంటే..?


Related News

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన

Anantapur Crime: ఫ్యాన్‌కు ఉరేసుకుని బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. కారణం ఏంటి..?

Big Stories

×