E-Paper
Advertisement

Chittoor: చిత్తూరులో దారుణం.. డ్రైవర్‌పై బస్సు ఎక్కించిన మరో డ్రైవర్

Chittoor: చిత్తూరులో దారుణం.. డ్రైవర్‌పై బస్సు ఎక్కించిన మరో డ్రైవర్

Chittoor Atrocious: చిత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ డ్రైవర్‌పై మరో డ్రైవర్ బస్సు ఎక్కించి చంపేశాడు. ఓ టోల్ గేట్ వద్ద జరిగిన ఘర్షణలో డ్రైవర్ పై మరో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బంగారుపాళ్యం మండలం మహా సముద్రం టోల్ గేట్ దగ్గర చిన్న గొడవతో డ్రైవర్ ను మరో డ్రైవర్ బస్సుతో ఢీకొట్టాడు.

మార్నింగ్ స్టార్, శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులు బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరాయి. రాత్రి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని మహాసముద్రం టోల్ గేట్ దగ్గరకు రెండు బస్సులు ఒకేసారి రావడంతో ఓ బస్సు అద్దం మరో బస్సుకు తగిలింది. ఈ కారణంగా రెండు బస్సుల డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుందిత.
ఈ క్రమంలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వెళ్లగా.. మార్నింగ్ స్టార్ బస్ డ్రైవర్ సుధాకర్ రాజు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆగ్రహంతో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు.. సుధాకర్ రాజుపైకి బస్సును ఎక్కించి హతమార్చాడు. బస్సుతో సుధాకర్ రాజును ఢీకొట్టడమే కాకుండా మృతదేహాన్ని కిలో మీటర్ దూరం వరకు ఈడ్చుకు వెళ్లాడు. దీంతో మృతదేహం చిద్రమైంది.
ఈ ఘటనకు సంబంధించి తోటి డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×