BigTV English

Hyderabad: వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

Hyderabad: వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..
Advertisement

Hyderabad: రోజురోజుకు రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి. భర్తను, భార్య చంపుతుంది.. భార్యను, భర్త చంపుతున్నాడు. వివాహేతర సంబంధాలే ఎక్కువ హత్యలకు దారి తీస్తున్నాయి. అలాంటి ఘటనే సరూర్ నగర్‌ ఠాణాలో జరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌ కోదండరామనగర్‌లో ఉంటున్న శేఖర్‌తో.. చిట్టికి16 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు (12), కూతురు (14) ఉన్నారు.


ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
అయితే నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన శేఖర్, రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టి కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. వారు సరూర్‌నగర్‌లోని కోదండరామ్‌నగర్ రోడ్డు నెంబర్ 7లో నివసిస్తున్నారు.

ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి భర్తను చంపిన భార్య
కొంతకాలంగా చిట్టికి అదే ప్రాంతంలో నివసించే హరీశ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. శేఖర్ తన డ్రైవర్ ఉద్యోగం కారణంగా తరచూ బయటికి వెళ్తుండటంతో ఈ సంబంధం మరింత బలపడింది. శేఖర్ ఈ విషయం తెలుసుకుని చిట్టిని పలుమార్లు మందలించాడు. ఇది వారి మధ్య గొడవలకు దారితీసింది. భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన చిట్టి, హరీశ్‌లు కలిసి అతడిని అంతం చేయాలని కుట్ర పన్నారు.


భర్త నిద్రిస్తున్న టైంలో గొంతు నులిమిన ప్రియుడు..
అయితే భర్త శేఖర్ నిద్రపోయిన తర్వాత చిట్టి తన కుమారుడిని పక్కన ఉన్న గణేశ్ మండపంలో నిద్రపోమని చెప్పి పంపించింది. ఆ తర్వాత హరీశ్‌ను ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి శేఖర్ గొంతు నులిమి, డంబెల్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఉదయం ఏమీ తెలియనట్లు నటించిన చిట్టి, భర్త నిద్రలోనే చనిపోయాడని 100 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, శరీరంపై గాయాలు గమనించి అనుమానం వ్యక్తం చేశారు. సమీపవాసులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ స్పిడ్ పెంచారు.

పోలీసుల అదుపులో నిందితురాలు చిట్టి ..
పోలీసులు చిట్టిని తమదైన శైలిలో విచారించగా, ఆమె మొదట ఖండించినప్పటికీ, చివరికి నిజం ఒప్పుకుంది. తాను హరీశ్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు చిట్టిని అరెస్ట్ చేసి, హరీశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ కేసును హత్యగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే హరీశ్ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

Also Read: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..కేసీఆర్ VS రేవంత్!

పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలింపు
ఇప్పుడు జరిగిన ఈ హత్య వివాహేతర సంబంధాలు ఎంత ప్రమాదకరమైనవో చెబుతుంది. కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, చిట్టి ఈ దారుణానికి పాల్పడటం సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు..

Related News

Nims Medico Death: నిమ్స్ ఆపరేషన్ థియేటర్ లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

Madhya Pradesh News: కాలేజీలో యూత్ ఫెస్టివల్.. అమ్మాయిల డ్రెస్సింగ్ రూమ్‌, యువకులు ఏం చేశారంటే

Crime News: ఆస్తి కోసం 3 రోజులుగా తల్లికి అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. ఛీ, వీళ్లు మనుషులేనా?

Hyderabad Crime: బూత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. అద్దెకు దిగిన దంపతులు షాక్, ఇంటి యజమాని అరెస్ట్

Hanumakonda Crime: చీరతో భర్తకు ఉరేసి చంపేసిన భార్య.. వికటించిన లవ్ మ్యారేజ్?

Bengaluru Crime: పట్టపగలు.. నడి రోడ్డుపై యువతి గొంతు కోసి.. దర్జాగా తప్పించుకున్న ఉన్మాది, చూస్తూ నిలబడిపోయిన జనం

AP News: చిత్తూరు జిల్లాలో విషాదం.. చూస్తుండగానే జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు..

IPS Arrest: ఐపీఎస్ అధికారి హర్‌‌చరణ్ అరెస్టు.. ఇంట్లో 5 కోట్ల నోట్ల కట్టలు, కేజిన్నర బంగారం, టాప్ బ్రాండ్ కార్లు

Big Stories

×