BigTV English

Eluru School Bus Incident: ఘోర ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. 25 మంది ప్రాణాలు

Eluru School Bus Incident: ఘోర ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. 25 మంది ప్రాణాలు
Advertisement

Eluru School Bus Incident: పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ బస్ పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సలో ఏకంగా 25 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. అయితే బస్సు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడే పంట పొలాల్లో పని చేస్తున్న రైతులు చెబతున్నారు.


Also Read: రష్యాతో దోస్తానా వద్దు! ఇండియాకు నాటో వార్నింగ్

పాలిగ్రామం శివారులో బస్సు బొల్తా పడింది. అయితే రోజులాగే బస్సు విద్యార్థులను బస్సు ఎక్కించుకుని స్కూల్ టైం అవుతుందని తొందరగా పిల్లలను స్కూల్‌కి చేర్చాలని కంగారులో అతివేగంతో వెళ్లిన బస్సు పంట చెల్లోకి దూసుకెళ్లింది. తణుకు శ్రీ సాయి విద్యాసంస్థలు బస్‌గా గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. అక్కడే ఉన్న రైతులు వెంటనే స్పందించి బస్సు లోపల ఉన్న పిల్లలను బయటకు తీసి గాయపడిన వారిని రక్షించేందుకు 108కు కాల్ చేశారు. దీంతో అంబులెన్స్ గాయపడిన వారిని అక్కడి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ఇదిలా ఉంటే రాజేంద్రనగర్‌లో డైరీ ఫామ్ చౌరస్తాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టమోటో లోడుతో వెళ్తున్న లారీ పిల్లర్‌ని ఢీకొట్టడంతో లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టమోటాలు రోడ్డుపై పడటంతో వాహన రాకపోకలకు అంతరాయం కల్గింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లీయర్ చేశారు.

Related News

Bengaluru Crime: మహిళపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ, బెంగుళూరులో షాకింగ్ ఘటన

Tuni Case Update: చెరువులో దూకే ముందు ఏం జరిగిందంటే.. తుని సీఐ చెప్పిన నిజాలు

Tuni case update: తుని ఘటన.. చెరువులోకి దూకి తాత ఆత్మహత్య

Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం, టార్గెట్ బీహార్ ఎన్నికలు?

Medak News: రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసులపై దాడి, మెదక్‌లో రాత్రి ఏం జరిగింది?

Tuni Girl Incidnet: తాత అని చెప్పి స్కూల్ నుండి తోటలోకి తీసుకెళ్లి.. తుని ఘటనపై డీఎస్పీ షాకింగ్ నిజాలు

Guntur District Tragedy: విషాదం.. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 63 మంది మృతి

Big Stories

×