E-Paper
Advertisement

Madhya Pradesh: ఓ రైలులో తల, మొండెం.. ఇంకో రైలులో కాళ్లు, చేతులు.. బిగ్ ఆఫర్ చేసిన పోలీసులు

Madhya Pradesh: ఓ రైలులో తల, మొండెం.. ఇంకో రైలులో కాళ్లు, చేతులు.. బిగ్ ఆఫర్ చేసిన పోలీసులు

Girl mutilated body inside in two trains: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికను హత్య చేసి ఆమె శరీర భాగాలను బ్యాగుల్లో మూటకట్టి రెండు వేర్వేరు రైళ్లలో పడేశారు. ముందుగా ఓ రైలులో ఉన్న గోనె సంచిలో బాలిక తల, మొండాన్నిఉండడాన్ని ప్రయాణికులు గుర్తించారు. మరో రైలులో కాళ్లు, చేతులున్న ఓ బ్యాగ్ ను కూడా పలువురు ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విధంగా రెండు రైళ్లలో బాలిక శరీర భాగాలు లభ్యం కావడంతో ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులను పట్టించినవారికి రూ. 10 వేల రివార్డ్ కూడా ఇస్తామని తెలిపారు.

మోవ్ నుంచి నాగ్దా మీదుగా ఇండోర్ కు తిరిగి వస్తున్న రైలులో ట్రాలీ బ్యాగ్, గోనె సంచులు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో వాటిని చెక్ చేయగా అందులో ఓ బాలిక శరీర భాగాలు కనిపించాయి. తల, మొండెం మాత్రమే కనిపించాయి. మిగతా భాగాలు మాత్రం కనిపించలేదు. అదేరోజు రిషికేశ్ చేరుకున్న మరో రైలులో బియ్యం బస్తాలో రెండు చేతులు, రెండు కాళ్లు కనిపించాయి. పలువురు వీటిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Also Read: రూ. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మిన ఘనుడు.. మోసపోయిన అమెరికా మహిళ!

ఈ ఘటన శనివారం జరిగినట్లు గుర్తించారు. రైళ్ల రాకపోకలను, ఆ రైళ్లలో ప్రయాణించిన వారిని పరిశీలించారు. ఆరోజు సాయంత్రం 5 గంటల తరువాత రెండు రైళ్లు ఉజ్జయిని ప్లాట్ ఫారమ్ నెంబర్2, 3పై ఉన్నాయని, ఆ సమయంలోనే ఈ బస్తాలను రైళ్లలో వేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. అయితే, అందులో ఎవరూ కూడా అనుమానాస్పదంగా కనిపించలేదని పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. నిందితులెవరో తెలిపిన వారికి రూ. 10 వేల రివార్డు కూడా ఇస్తామంటూ ప్రకటించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×