E-Paper
Advertisement

Husband kills Wife: పట్టపగలు నడిరోడ్డుపై.. భార్యను కాల్చి చంపిన భర్త

Husband kills Wife: పట్టపగలు నడిరోడ్డుపై.. భార్యను కాల్చి చంపిన భర్త
Advertisement

Husband kills Wife: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రూప్ సింగ్ స్టేడియం ఎదుటనే భర్త.. తన భార్యపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఒకసారిగా గందరళగోళం నెలకొంది.

సంఘటన ఎలా జరిగింది?

ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు అరవింద్ తన భార్యతో గత కొంతకాలంగా విభేదాలు కొనసాగిస్తున్నాడు. ఈ విభేదాలు వ్యక్తిగత సమస్యలతోపాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. మరింత ముదిరినట్లు తెలుస్తోంది. అదే ఆవేశంలో అరవింద్ తన దగ్గరున్న తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. కాల్పులు జరగడంతో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

పోలీసుల రాక, ఉద్రిక్త పరిస్థితి

Advertisement

కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే గన్‌తో నిలబడి ఉన్న నిందితుడు పోలీసులను సైతం బెదిరించాడు. తుపాకీతో వారిని లక్ష్యం చేస్తూ ఎవరూ తన దగ్గరికి రాకూడదని హెచ్చరించాడు. దీనితో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.

టియర్ గ్యాస్‌తో అదుపు

పరిస్థితి నియంత్రణలోకి రాకపోవడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నిందితుడిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో అక్కడ పొగ వ్యాపించడంతో అరవింద్ కాసేపటికి అసహనంతో తుపాకీని వదిలి వేయాల్సి వచ్చింది. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు.

దర్యాప్తు దిశగా పోలీసులు

Advertisement

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడికి తుపాకీ ఎలా దొరికింది? లైసెన్స్ ఉందా? లేక అక్రమంగా తెచ్చుకున్నాడా? అన్న విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా భార్యపై కాల్పులు జరపడానికి.. నిజమైన కారణాలు ఏంటి అన్న దానిపై కూడా విచారణ జరుగుతోంది.

సామాజిక సమస్యల ప్రతిబింబం

ఈ ఘటన మరోసారి కుటుంబ కలహాలు.. ఎంతటి దారుణ ఫలితాలను ఇస్తాయో గుర్తు చేసింది. చిన్న చిన్న విభేదాలు పరిష్కారం కాని స్థాయికి చేరితే.. ఇలాంటి విషాదాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్యలు ఉంటే చట్టపరమైన మార్గాలు, కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవాల్సిందే కానీ.. హింసకు పాల్పడకూడదని వారు సూచిస్తున్నారు.

Also Read: నిద్రమత్తు.. రెప్పపాటులో ప్రమాదం!

గ్వాలియర్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికులను మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కుటుంబ విభేదాలు ప్రాణహానికి దారితీసే స్థాయికి చేరడం ఆందోళన కలిగించే విషయం. పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకూడదని, కుటుంబ కలహాలు శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవాలని సామాజిక వర్గాలు పిలుపునిస్తున్నాయి.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×