Suicide Bomb Blast in Pakistan: పాకిస్తాన్ లోని కరాచీలో శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. విదేశీయులు ప్రయాణిస్తున్న వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ దాడిలో సూసైడ్ బాంబర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపింది. లాంధీలోని మన్సేరా కాలనీలో దాడి జరిగింది. ఈ దాడి సమయంలో వ్యాన్ ఐదుగురు విదేశీయులు ఉండగా.. వారంతా తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు ఒక నివేదిక పేర్కొంది. వారంతా జపాన్ కు చెందినవారుగా గుర్తించారు.
Also Read: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి, టార్గెట్ ఎయిర్ బేస్లు
బైక్ పై వచ్చిన ఉగ్రవాదులు వ్యాన్ లక్ష్యంగా దాడి చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. తొలుత కాల్పుల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యాయరని, ఆ తర్వాత బాంబ్ ను పేల్చినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారి వద్ద గ్రెనేడ్లు, కలాష్ని కోవ్ తో నిండి ఉన్న ఒక బ్యాగ్ ను గుర్తించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది శరీరానికి బాంబ్ జాకెట్, గ్రెనేడ్ ఉన్నట్లు తెలిపారు. బాంబ్ స్క్వాడ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.