E-Paper
Advertisement

School Building collapse: కుప్పకూలిన స్కూల్ పైకప్పు.. చిక్కుకున్న చిన్నారులు..

School Building collapse: కుప్పకూలిన స్కూల్ పైకప్పు.. చిక్కుకున్న చిన్నారులు..

School Building collapse: రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. చదువుకునేందుకు పొద్దున్నే బడికెళ్లిన విద్యార్థులను మృత్యువు కబళించింది. ఝాలవర్‌లో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలింది. నలుగురు విద్యార్థులు మృతి చెందారు. శిథిలాల కింద మరో 40 మంది చిన్నారులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టారు. అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగి రెస్క్యూ మొదలుపెట్టింది.

శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు..
ఘటనా స్థలానికి చేరుకున్న ఝలావర్ కలెక్టర్, ఎస్పీ అమిత్ కుమార్ అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. జెసిబి యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగించే పనులు శరవేగంగా కొనసాగించారు. గాయపడిన విద్యార్థులను అక్కడి సమీపంలోని ఆసుపత్రికి తరలించి, అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు సమిష్టిగా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఏపీ రాజధాని అమరావతిపై.. విషం చిమ్మిన కేతిరెడ్డి

ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొవాలని స్థానికులు డియాండ్..

మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ దుర్ఘటన పాఠశాల భవనాల నిర్మాణ నాణ్యత నిర్వహణపై తీవ్ర చర్చను రేకెత్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు శిథిలావస్థలో ఉండటం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యలు మరోసారి బహిర్గతమయ్యాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×