E-Paper
Advertisement

Suspicious Death of a Family: తీవ్ర విషాదం.. ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..!?

Suspicious Death of a Family: తీవ్ర విషాదం.. ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..!?

Suspicious Death of a Family: ఉగాది పండగ వేళ సత్య సాయి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మడకశిరలో ఇంటిల్లిపాదితో సంతోషంగా పండగ జరుపుకోవాల్సిన సమయంలో ఓ ఫ్యామిలీ అనంత లోకాలకు చేరుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

గాంధీ బజార్‌లో నివాసం ఉండే గోల్డ్ వ్యాపారి కృష్ణా చారి అతని భార్య సరళ.. పిల్లలు సంతోష్, భువనేశ్‌ చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. పండగ వేళ ఉదయం నుంచి ఎవరూ భయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు కిటికీలో నుంచి తొంగి చూశారు. మొత్తం కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల ఇంటిని కూడా పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో మాత్రం సూసైడ్ నోట్ కూడా కనిపించలేదని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఫ్యామిలీ మొత్తం మాస్ సూసైడ్ చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను హాస్తిటల్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత ఈ కుటుంబం నిజంగానే అత్మహత్యకు పాల్పడిందా లేదా అనే దానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Tags

Related News

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

Big Stories

×