BigTV English

Tamil Nadu Crime News: పట్టపగలే.. కారును వెంబడించి, కత్తులతో నరికి చంపిన దుండగులు.. వీడియో వైరల్!

Tamil Nadu Crime News: పట్టపగలే.. కారును వెంబడించి, కత్తులతో నరికి చంపిన దుండగులు.. వీడియో వైరల్!

Tamil Nadu Murder: కత్తులతో సావాసం, నెత్తుటితో సమాప్తం అన్నట్లు.. ఎంతో మందిని ఘోరంగా చంపిన ఓ పేరు మోసిన రౌడీ షీటర్ చివరకు ప్రత్యర్ధుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. తమిళనాడులోని సేలమ్- నసియానూర్ హైవేపై జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చకర్లు కొడుతోంది.


జాన్ అనే 35 ఏండ్ల వ్యక్తి చాణక్య తరుప్పూర్ లోని పెరియపాళ్యం నివాసి. అతడి మీద సేలం అంతటా పలు పోలీస్ స్టేషన్లలో బోలెడు కేసులు ఉన్నాయి. వాహనాల అమ్మకాలు, వడ్డీ వ్యాపారాలు చేస్తుంటాడు. దందాలు, సెటిల్ మెంట్లు వేరే ఉన్నాయి. ఓ గ్యాంగ్ ను మెయింటెయిన్ చేసే వాడు. ల్యాండ్ సెటిల్ మెంట్లు కొనసాగించేవాడు. అడ్డు వచ్చిన వాళ్లను ఏమాత్రం ఆలోచించకుండా లేపేసేవాడు. ప్రస్తుతం అయ్యగారి మీద అనేక కేసులు ఉడటంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు సేలం ప్రాంతంలో ఆయన ఓ పేరు మోసిన దాదాగా చలామణి అవుతున్నాడు.

పట్టపడలే నడిరోడ్డు మీద రౌడీషీటర్ హత్య


తాజాగా జాన్ తన ఫ్యామిలీతో కలిసి సేలమ్- నసియానూర్ హైవేపై కారులో ప్రయాణిస్తుండగా, దుండగులు అటాక్ చేశారు. బుధవారం(మార్చి 19న) అన్నదానపట్టి పోలీస్ స్టేషన్‌ లో హాజరైన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక కారు అతనిని వెంబడించింది. జాతీయ రహదారి ఎక్కిన తర్వాత ఆ వాహనం జాన్ కారును బలంగా ఢీకొట్టింది. నసియనూర్ సమీపంలో జాన్ వెంటనే కారు ఆపాడు. వెంటనే వెనుక నుంచి వచ్చిన కారులో నుంచి నలుగురు వ్యక్తులు కత్తులతో దిగారు. కారులో ఉన్న అతడి భార్య శరణ్యను కిందికి లాగి, జాన్ మీద దాడి చేశారు. అతడు కారులో నుంచి బయటకు దిగేందుకు ప్రయత్నించినా, బయటకు రాకుండా నలుగు నాలుగు వైపుల నుంచి విచక్షణా రహితంగా కత్తులతో నరికారు. తన భర్తను చంపొద్దని శరణ్య వాళ్లను వేడుకున్నా, పట్టించుకోలేదు. దుండగుల దాడిలో జాన్ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే చనిపోయాడు. ఈ హత్యకు సంబందించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. నలుగురు వ్యక్తులు దాడి చేస్తున్నట్లు అందులో కనిపించింది. వాళ్లు జాన్ ను నరుకుతుంటే పక్కన వెళ్లే వాళ్లు భయంతో అక్కడి నుంచి పరిగెత్తారు.

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

విషయం తెలియడంతో సిథోడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాన్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం పెరుండురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. అటు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని  అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్లే. నిందితుల్లో ముగ్గురు సరీష్, శరవణన్,  భూపాలన్‌ ను ముందుగా పట్టుకున్నారు. ఆ తర్వాత నాల్గవ నిందితుడు కార్తీక్‌ ను అరెస్టు చేశారు. హత్యకు సెటిల్ మెంట్ల గొడవలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య వెనుక అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Read Also: పిల్లల దొంగల ముఠా అరెస్ట్.. వీళ్ళు చిన్నారులను ఎలా అమ్ముతారంటే!

Related News

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో స్టూడెంట్ డెడ్‌బాడీ

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Big Stories

×