E-Paper
Advertisement

3 People Died due to Electric Shock: సనత్‌నగర్‌లో విషాదం.. ముగ్గురు మృతి

3 People Died due to Electric Shock: సనత్‌నగర్‌లో విషాదం.. ముగ్గురు మృతి

3 people died due to electric shock: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర ఇతర వార్తా కథనాల ప్రకారం.. సనత్ నగర్ జెక్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ రెండో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో ముగ్గురు మృతిచెందారు.

అయితే, ఆదివారం ఉదయం పని మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదు. అనంతరం ఆమె ఇంట్లో పని చేసి వెళ్లిపోయింది. మళ్లీ సాయంత్రం 3 గంటలకు వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికి.. మరోసారి ఇళ్లంతా వెతికింది. ఈ క్రమంలో బాత్ రూమ్ డోర్ లాక్ అలాగే ఉండడంతో అనుమానం వచ్చి అపార్ట్ మెంట్ నిర్వాహకులకు విషయం తెలియజేసింది.

Also Read: రీల్స్ చేస్తూ..రియల్ గానే పోయాడు..అంబర్ పేటలో విషాదం

వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని డోర్ పగులగొట్టి చూడగా ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. అయితే, తొలుత వీరు విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్లు భావించినప్పటికీ, అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఘటనా స్థలి వద్ద ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించనున్నట్లు పోలీసులు చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

Tags

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×