E-Paper
Advertisement

Travels Bus Accidents: తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సులు బోల్తా.. పలువురు మృతి

Travels Bus Accidents: తెలుగు రాష్ట్రాల్లో  ట్రావెల్స్ బస్సులు బోల్తా.. పలువురు మృతి

Travels Bus Accident in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదాలతో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అదే సమయంలో నిర్మల్‌ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఓ ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడి ఇద్దరు పిల్లలు చనిపోయిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తుండగా.. బస్సు లోపల చిక్కుకున్న మరికొందరు ప్రయాణీకులను స్థానికులు బయటికి తీసి రక్షించారు. హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. గాయపడిన వారిని కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి అతి వేగమే కారణమా లేక నిద్రమత్తా అనే కోణంలో విచారణ చేపట్టారు.

Also Read: నెల్లూరులో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే!!

కాగా.. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ పై మస్కాస్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన జరిగే సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.

ఒకరు మాత్రం అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ట్రావెల్ బస్సు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా.. ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే తరుణంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×