BigTV English

Crime News: రాష్ట్రంలో పిడుగుల బీభత్సం.. ఇద్దరు చనిపోయారు..

Crime News: రాష్ట్రంలో పిడుగుల బీభత్సం.. ఇద్దరు చనిపోయారు..

Crime News: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలో భారీ వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం కురిసింది. అయితే మహబూబాబాద్ జిల్లాలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.


ఒకరు గూడూరు మండలం గుండెంగ పంచాయతీ ఉద్యోగి మృతిచెందగా.. మరొకగరు ఓటాయి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి చేరాలు చనిపోయాడు. దీంతో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయ్యింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు నెలలు కష్టపడి పండించిన పంట.. చేతికి రాకపోయేసరికి పుట్టెడు దుఖంతో మునిగిపోయారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: SBI Jobs: SBIలో భారీగా జాబ్స్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు.. డోంట్ మిస్


ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Skywalk: హైదరాబాద్‌లో అత్యద్భుతంగా మరో స్కైవాక్.. త్వరలోనే ప్రారంభం.. ఎక్కడో తెల్సా..?

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×