E-Paper
Advertisement

Aishwarya Rajesh: ఆ షోకు పేమెంట్ ఇవ్వలేదు.. వడ్డీతో కలిపి రూ.5 లక్షలయ్యింది: ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh: ఆ షోకు పేమెంట్ ఇవ్వలేదు.. వడ్డీతో కలిపి రూ.5 లక్షలయ్యింది: ఐశ్వర్య రాజేష్
Advertisement

Aishwarya Rajesh: హీరో, హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలో చాలా కమర్షియల్‌గా ఉంటారని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. వాళ్లు రెమ్యునరేషన్ లేకుండా ఏమీ చేయరని అంటుంటారు. కానీ కొందరు నటీనటులు అలా కాదు. అలా పారితోషికం విషయంలో తను ఎలా మోసపోయాననే విషయాన్ని తాజాగా బయటపెట్టింది ఐశ్వర్య రాజేశ్. కానీ ఆ విషయాన్ని తను నవ్వుతూ చెప్పింది. తాజాగా ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘శబ్దం’ మూవీ ప్రమోషన్స్‌లో ఐశ్వర్య కూడా పాల్గొంది. సినిమాలో తను భాగం కాకపోయినా ప్రమోషన్స్‌లో మాత్రం మూవీ టీమ్‌తో కలిసి సందడి చేసింది. అందులోనే తనకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఒక యాక్టర్ హ్యాండ్ ఇచ్చాడనే విషయం రివీల్ చేసింది.

వడ్డీతో లక్షలు

Advertisement

ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోగా నటించిన ‘శబ్దం’ (Sabdham)లో లక్ష్మి మీనన్ హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు లైలా, సిమ్రాన్ లాంటి సీనియర్ నటీమణులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. తాజాగా ఐశ్వర్య రాజేశ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆదితో పాటు లైలా, యాక్టర్ రెడిన్ కింగ్స్‌లే (Redin Kingsley), డైరెక్టర్ అరివరగన్ వెంకటాచలం పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో రెడిన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది ఐశ్వర్య రాజేశ్. తనతో కలిసి ఒక షోలో చేసినందుకు రూ.5 వేలు రెమ్యునరేషన్ ఇవ్వాలని, అది ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో అందరూ నవ్వుకున్నారు. అయితే అలా చేయకూడదని, రెమ్యునరేషన్ ఇచ్చేయాలని ఐశ్వర్యకే సపోర్ట్ చేశాడు ఆది.

మోస్ట్ వాంటెడ్ కమెడియన్

Advertisement

అప్పట్లో ఆ రెమ్యునరేషన్ రూ.5 వేలు అని, ఇప్పుడు అది వడ్డీతో కలిపి రూ.5 లక్షలు అయ్యిందని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh). దానికి రెడిన్ మాత్రం ఏమీ మాట్లాడకపోయినా.. అలా చేయడం కరెక్ట్ కాదంటూ అందరూ ఐశ్వర్యకే సపోర్ట్ చేశారు. మొత్తానికి తను చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్‌లో కమెడియన్‌గా ఉన్నా కూడా గత మూడేళ్లలోనే రెడిన్‌కు ఎక్కువగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘డాక్టర్’ మూవీతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు రెడిన్. అలాగే తనకు తెలుగులో కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది.

Also Read: ఇప్పటికీ అదే అందం.. వేడి వేడి పేడనే తన సీక్రెట్ అంటున్న లైలా..

తెలుగు డెబ్యూ

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీతో తెలుగులో అడుగుపెట్టాడు రెడిన్ కింగ్స్‌లే. ఆ మూవీలో పోస్ట్‌మ్యాన్ పాత్రలో కనిపించి మరోసారి కామెడి పండించాడు. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘శబ్దం’ అనేది హారర్ కామెడీ మూవీనే అయినా అందులో కూడా రెడిన్ తనవంతు కామెడీ చేశాడు. తాజాగా విడుదలయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఇప్పటికే దర్శకుడు అరివారగన్ వెంకటాచలం, ఆది కాంబినేషన్‌లో ‘వైశాలి’ అనే మూవీ వచ్చింది. అప్పట్లో ఆ సినిమా హారర్ జోనర్‌లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే కేటగిరిలో ‘శబ్దం’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×