E-Paper
Advertisement

Dhanush Divorce : ధనుష్, ఐశ్వర్య విడాకుల విచారణ మళ్ళీ వాయిదా… కావాలనే దూరంగా ఉంటున్నారా?

Dhanush Divorce : ధనుష్, ఐశ్వర్య విడాకుల విచారణ మళ్ళీ వాయిదా… కావాలనే దూరంగా ఉంటున్నారా?

Dhanush Divorce : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విడాకుల వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐశ్వర్యతో ధనుష్ విడాకుల వ్యవహారంపై కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ జంట నేడు విచారకు హాజరు కావలసి ఉండగా, ఇద్దరూ గైర్హాజరు అయ్యారు. దీంతో మరోసారి ధనుష్, ఐశ్వర్యల విడాకుల కేసు వాయిదా పడింది. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడడం చూస్తుంటే ఈ కేసులో కావాలనే ఇటు ధనుష్, అటు ఐశ్వర్య జాప్యం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

రెండేళ్ల క్రితమే విడాకుల పిటిషన్

2004లో లవ్ మ్యారేజ్ చేసుకున్న ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దాదాపు 18 ఏళ్లపాటు వైవాహిక జీవితాన్ని కంటిన్యూ చేశారు.. ఈ జర్నీలో వారికి లింగా, యాత్ర అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా బాగానే ఉన్న ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోవాలని డిసైడ్ అయ్యారు. 2022లో విభేదాల కారణంగా తామిద్దరం విడిపోతున్నామని అఫీషియల్ గా సోషల్ మీడియా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు ఈ మాజీ దంపతులు. ఈ షాకింగ్ వార్తతో అటు రజినీ అభిమానులు ఇటు ధనుష్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తరువాత ఈ జంట మళ్లీ కలిసే ఛాన్స్ ఉందని రూమర్లు విన్పించినా అది జరగలేదు. ఇక అప్పటి నుంచి ఈ జంట వేరుగానే ఉంటున్నారు.. ఈ నేపథ్యంలోనే ధనుష్ ఐశ్వర్య ఇద్దరూ కలిసి తమ వైవాహిక సంబంధాన్ని ఇంకా కంటిన్యూ చేయలేమంటూ మ్యూచువల్ డివోర్స్ కోసం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో రెండు ఏళ్ల క్రితమే పిటిషన్ వేశారు. పిటిషన్ అయితే వేశారు కానీ ఇప్పటిదాకా కోర్టులో ఈ జంట హాజరు కాకపోవడం గమనార్హం.

వాయిదాల మీద వాయిదాలు…

నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లోనే ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ న్యాయస్థానం ముందు హాజరవ్వాలని కోర్టు నోటీసులు పంపింది. కానీ పలు కారణాల వల్ల ఇద్దరూ హాజరు కాకపోవడంతో అక్టోబర్ 7 కు విచారణ వాయిదా వేశారు. కానీ ఈరోజు కూడా ఇద్దరు కోర్టులో హాజరు కాకపోవడంతో ఈ విడాకుల కేసును అక్టోబర్ 19కి వాయిదా వేసినట్టు తాజాగా న్యాయమూర్తి వెల్లడించారు. కాగా ఈ జంటను కలపడానికి రజనీకాంత్ తీవ్రంగా ప్రయత్నించారని వార్తలు వినిపించాయి. అయినప్పటికీ ఇద్దరు డివోర్స్ తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో కోర్టు మెట్లు ఎక్కారు. కానీ ఇప్పుడు విచారణ మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండడంతో ధనుష్ అభిమానులు మళ్లీ ఈ జంట ఒక్కటవ్వాలని  కోరుకుంటున్నారు. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ హార్ట్ సర్జరీ కారణంగా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య రజనీకాంత్ కోర్టులో ఈరోజు విచారణకు హాజరు కాకపోయి ఉండొచ్చు. మరి అక్టోబర్ 19న అయినా ధనుష్, ఐశ్వర్య న్యాయస్థానం ముందు ఈ కేసులో విచారణకు హాజరవుతారా? అన్నది చూడాలి. మరోవైపు ధనుష్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×