Ravi Teja’s Mr Bachhan Director Harish Shankar Visits Ayodhya Ram Mandir: మస్ మహారాజా ప్రస్తుతం ఫుల్ దూకుడు మీద ఉన్నాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఈ ఏడాది ‘ఈగల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత అంతా తారుమారు అయిపోయింది.
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్గా మిగిలింది. దీంతో రవన్న ఈ సారి తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చేస్తున్నాడు.
మాస్ రీయూనియన్గా వస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ను మేకర్స్ పంచుకున్నారు. ఈ మూవీ ఉత్తరప్రదేశ్లో 30 రోజుల షూటింగ్ను కంప్లీట్ చేసుకుందని తెలిపారు. ఈ మేరకు ఈ షెడ్యూల్ షూటింగ్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
Also Read: మిస్టర్ బచ్చన్ స్టోరీ ఇదే.. హిట్ కన్ఫర్మ్ ?
ఇక ఈ షూటింగ్ పూర్తయిన అనంతరం దర్శకుడు హరీశ్ శంకర్ అండ్ టీం అయోధ్య రామమందిరం ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు అక్కడ రామ్ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే దర్శకుడు హరీశ్ శంకర్ పవన్ కల్యాన్తో ‘ఉస్తాద్ భగత్సింగ్’ మూవీ చేస్తున్నాడు.
#MrBachchan director Harish Shankar and team visit Ayodhya pic.twitter.com/aTF3f9DsXQ
— Milagro Movies (@MilagroMovies) April 18, 2024
ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ సమరం మొదలు కావడంతో పవన్ ఈ మూవీకి బ్రేక్ ఇచ్చాడు. ఈ క్రమంలో దర్శకుడు హరీశ్.. రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ను స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఇందులో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు సంబంధించిన పోస్టర్ను మేకర్స్ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు.