బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్, ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ పహారియా తనయుడితో ప్రేమలో పడింది అమ్మడు. ఈ మ్యాటర్ అధికారికంగా ఎక్కడ చెప్పకపోయినా.. ప్రతి ప్రోగ్రాం కి వీరిద్దరూ హాజరవుతున్నారు. ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు జాన్వి శిఖర్ తో రావడం మనం చూసాము. తాజాగా వీరు ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ లో, శిఖర్ జాన్వికి స్కూటర్ ను నేర్పిస్తున్నట్లుగా, ఆమె ముందు కూర్చుంటే వెనకాల అతను బండి పట్టుకొని ఆమెను తీసుకువెళ్తున్నాడు. ఈ ఫోటోలను షేర్ చేసిన జాన్వి క్యాప్షన్ గా “అతనుకు నాతో రైడ్ కి వెళ్లడం చాలా ఇష్టం. అందుకే ఇలా” అని అందుకే ఇలా అంటూ పోస్ట్ చేశారు. అది చూసిన వారంతా క్యూట్ లవ్ బర్డ్స్ అంటు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇద్దరు ఆలా ..
జాన్వి, శిఖర్ 2016 నుండి స్నేహితులు. ఈమె బాలీవుడ్ లో ధడక్ సినిమాకి ముందు నుంచి డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు బయటికి వచ్చాయి. కొన్ని కారణాలతో వీరు విడిపోయారని కూడా అప్పట్లో అనుకున్నారు. ఆ తర్వాత 2022లో మళ్ళీ ఇద్దరూ కలిశారు. ప్రైవేట్ ఫంక్షన్ కి, ఇద్దరూ కలిసి రావడంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కన్ఫామ్ అయింది. తాజాగా జరిగిన అనంత్ అంబానీ రాధిక వివాహంలో, తిరుపతి దర్శనానికి వీరిద్దరూ కలిసి కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జాన్వి తన ప్రేమికుడి గురించి చెబుతూ.. ప్రస్తుతం మేము చాలా సంతోషంగా ఉన్నాము. వివాహం గురించి ఇంకా మేము ఆలోచించలేదు. దానికి ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాను అని తెలిపింది. జాన్వి, సిద్ధార్థ మల్హోత్రతో పరం సుందరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 25 న విడుదల కానుంది.