Jr NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మాస్ యాక్షన్ డ్రామా గా రానుంది.యాక్షన్ సన్నివేశాలను భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 జనవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నిమిషాలలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇక బ్యాక్ టు బ్యాక్ షూటింగ్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 31 వ సినిమాగా రానుంది. రీసెంట్ గా ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో, ఎన్టీఆర్ అడుగుపెట్టనున్నారు. ఇటీవల ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తిరిగి వచ్చారు. ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. ఈనెల 23 నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 22 నుంచి మే 15 వరకు మొదటి షెడ్యూల్ ఉంటున్నట్లు సమాచారం. ఈ టైంలోనే ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత ని అనుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్టీఆర్ దుబాయ్ నుంచి తిరిగి రావడం, షూటింగ్ మొదలు పెడతాడు అన్న వార్తతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
బాలీవుడ్ మూవీ ..
ఇక సినిమా విషయానికి వస్తే, రీసెంట్ గా దేవర సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకొని, ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో షూటింగ్ లో పాల్గొననున్నారు. సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నిచ్చిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను తిరగ రాస్తాడు అని,బాక్స్ ఆఫీస్ వద్ద, కాసుల వర్షాన్ని కురిపిస్తాడని అభిమానులు భారీగా అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Hrithik Roshan : అంతా ఎన్టీఆర్ వల్లే… వార్ 2 మూవీలో ఇదే హైలెట్