Allu Arjun: సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతారో అనేది ఎవరం చెప్పలేము. ముఖ్యంగా దేశం మొత్తం సెన్సేషన్ సృష్టించిన విషయం ఏదైనా జరిగితే.. అందుకు సంబంధించిన ప్రతి ఒక్కరు వైరల్ గా మారిపోతారు. ఒక సినిమా భారీ విజయం అందుకుంది అంటే.. ఆ సినిమాలో నటించిన హీరో దగ్గర నుంచి అందులో నటించిన ఒక గెస్ట్ రోల్ వరకు ఫేమస్ అవుతారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న పేరు అల్లు అర్జున్.
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. నాంపల్లి కోర్టులో విచారణకు అల్లు అర్జున్ ను హాజరుపర్చారు. కోర్టు ముందు 14 రోజుల రిమాండ్ ను విధించింది. ఆ తరువాత వెంటనే బన్నీకి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. దానికి కారణం ఖచ్చితంగా బన్నీ లాయర్ నిరంజన్ రెడ్డి అనే చెప్పాలి.
RGV: దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా.. అంటే ఏంటి వర్మ.. అల్లు అర్జున్ దేవుడని అంటున్నావా..?
వైసీపీ అధినేత జగన్ కు పర్సనల్ లాయర్ గా ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. నిరంజన్ రెడ్డి కేవలం లాయర్ గానే కాదు నిర్మాతగా కూడా సుపరిచితుడే. క్షణం, ఘాజి, ఆచార్యలాంటి సినిమాలు నిర్మించాడు. అయినా కూడా చాలా తక్కువమందికి మాత్రమే నిరంజన్ రెడ్డి తెలుసు.
ఇక ఇప్పుడు బన్నీ కేసు వలన మరింత ఫేమస్ అయ్యాడు. కోర్టులో నిరంజన్ రెడ్డి మాట్లాడిన లాజిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పైన ఆ తల్లి, అబ్బాయి పడిపోయిన కూడా చాలామంది పోలీసులు పై ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసారు. అంటే పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడడానికి కిందకు వచ్చేసారు. అంతేకాకుండా ఇండియాలో క్రికెట్ మ్యాచెస్ జరిగితే పోలీస్ ఆఫీసర్లంతా మ్యాచ్ చూస్తారు.
కానీ బయట దేశాల్లో మ్యాచ్ జరిగితే వాళ్లంతా క్రౌడ్ ను చూస్తారు అంటూ చెప్పిన విధానం అందరి దిమ్మలు తిరిగేలా చేసింది. దీంతో అసలు నిరంజన్ రెడ్డి ఒక్కో కేసుకు ఎంత తీసుకుంటాడు.. ? అల్లు అర్జున్ కేసుకు నిరంజన్ రెడ్డి ఎంత తీసుకున్నాడు.. ? అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు నిరంజన్ రెడ్డి ఒక్కో కేసుకు రూ. 5 లక్షలు వరకు తీసుకుంటాడట. కేవలం ఒక గంట వాదించినందుకు రూ. 5 లక్షలకు పైనే అందుకుంటాడట. ఇక ఇది బాగా హై ప్రొఫైల్ కేసు కాబట్టి.. కనీసం రూ. 10 లక్షల వరకు అందుకునే ఛాన్స్ లు ఉన్నాయని టాక్ నడుస్తోంది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
Mega Family – Allu Family : అన్నిటికీ రాలేదు, కన్నీటికి వచ్చారు
అదేంటి కేవలం లక్షల్లోనే నా ఫీజు. మేము కోట్లలో అనుకున్నామే అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా మధ్యంతర బెయిల్ మాత్రమే కాబట్టి.. ఇంకా నాలుగువారాల తరువాత మళ్లీ కేసు కొనసాగుతోంది. అప్పుడు కూడా నిరంజన్ రెడ్డినే వాదించాలి. ఈ కేసు ముగిసేలోపు నిరంజన్ రెడ్డి కోట్లలోనే అందుకుంటాడేమో అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి.