E-Paper
Advertisement

Kantara 2: కాంతారా 2 షూటింగ్లో అపశృతి.. పడవ బోల్తా.. హీరోతో సహా!

Kantara 2: కాంతారా 2 షూటింగ్లో అపశృతి.. పడవ బోల్తా.. హీరోతో సహా!
Advertisement

Kantara 2.. కాంతారా 2.. ఏ ముహూర్తాన సినిమా షూటింగ్ మొదలు పెట్టారో తెలియదు కానీ నిజజీవితంలో అసలైన భయం ఏంటో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా దేవుడు ఉన్నాడు.. దేవుడితో ఆటలు ఆడడం సమంజసం కాదు అని.. ఈ సంఘటనలు మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. రిషబ్ శెట్టి కాంతారా 2( Kantara 2)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన ప్రారంభించారో తెలియదు కానీ వరుస విషాదాలు మాత్రం అందరిలో భయాలను పుట్టిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటివరకు ముగ్గురు ఈ సినిమా కోసం పని చేసిన వారు చనిపోగా.. ఇప్పుడు ఏకంగా హీరో ఆ ప్రమాదం నుండి బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఈసారి హీరోకే ప్రమాదం..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. కాంతారా 2 సినిమా షూటింగ్లో ఇప్పుడు మరో ప్రమాదం చోటుచేసుకుంది.. కర్ణాటకలోని మస్తికట్ట వద్ద ఉన్న రిజర్వాయర్లో రాత్రివేళ నటుడు రిషబ్ శెట్టితో సహా 30 మందికి పైగా ఉన్న పడవ బోల్తా పడింది.. అయితే వారంతా క్షేమంగా ఒడ్డుకు ఈత కొట్టుకుంటూ వచ్చారని సమాచారం. ఇకపోతే ఈ ప్రమాదంలో షూటింగ్ కోసం తీసుకెళ్లిన కెమెరాలు, ఇతర వస్తువులు అన్ని నీటిలో మునిగిపోయాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా షూటింగ్ సెట్లో ఇలా వరుస విషాదాలు చూస్తే ఏదో అతిపెద్ద ప్రమాదమే జరగబోతోంది అని అందరూ భయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

ఇప్పటివరకు ముగ్గురు మృతి.

Advertisement

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమా కోసం తమ ప్రాణాలను అర్పించారు. మృతుల వివరాల విషయానికి వస్తే.. 2024 నవంబర్లో సినిమా షూటింగ్ నిమిత్తం జూనియర్ ఆర్టిస్టులందరూ ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ బస్సు కొల్లూరు సమీపంలోని జడ్కల్ లో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా.. ప్రాణాపాయం నుండి అందరూ బయటపడ్డారు.

ఇక తర్వాత కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్టు ఎం.ఎఫ్ కపిల్.. ఈ ఏడాది మే నెలలో కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి గుర్తు తెలియని రీతిలో మరణించారు.

ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే అదే మే నెల 12వ తేదీన కాంతారా కళాకారుడు రాకేష్ పూజారి కూడా గుండెపోటుతో మరణించారు..

వీరే కాకుండా కేరళలోని త్రిసూర్ కి చెందిన విజు వీకే కూడా సినిమా షూటింగ్ కి వచ్చి ఆయన కూడా గుండెపోటుతో మరణించారు. ఇలా ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు హీరో ఉన్న పడవకే ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:Tollywood: ఈ మెగా బ్రదర్స్ మధ్య దూరం పెరిగిందా.. అసలేం జరిగిందంటే?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×